Home Political news జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు ప్రతిపక్ష...

జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా తీసివేయాలని

3
0

 జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా తీసివేయాలని

ప్రయత్నం చేసారని..అప్పటి గన్నవరం ఎమ్మెల్యే ను వైసీపీలోకి తీసుకున్నారని ఈ విషయం తనతో స్వయంగా జగన్ చెప్పారని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు . అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన శుక్రవారం మాట్లాడుతూ విశాఖ లో ఒక శాసన సభ్యుడుని, చీరాలలో ఒక ఎమ్మెల్యే ను, గుంటూరు లో మరో ఎమ్మెల్యేను వైసీపీ లోకి తీసుకున్నారని మరో ఇద్దరు రాకపోవడం వల్ల ప్రతిపక్ష హోదా తీయలేకపోయిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికలో గెలిచిన వెంటనే టీడీపీ ఎమ్మెల్యేలను వెంటనే వైసీపీ లో చేర్చుకొని చంద్రబాబు కు ప్రతిపక్ష హోదా తీసివేయాలని చూసారని అందుకు చేయని ప్రయత్నం అంటూ లేదని విమర్శించారు. 2019 నుండి 2024 వరకు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యం అని… బాష మీద కూడా దాడి జరిగిందని అందుకే ప్రజలు ముఖ్యమంత్రి హోదా తీసివేయడమే కాకుండా ప్రతిపక్షహోదా కూడా తీసివేశారని చెప్పారు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే హోదా అడగడం భావ్యం కాదని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారు కానీ ఇలా ప్రతిపక్ష హోదా కోసం అడిగితే ప్రజలు హర్షించారని చెప్పారు. జగన్ పనికిమాలిన విమర్శలు చేయటం మానుకోవాలని హితవు పలికారు. తన తల్లి విజయమ్మ ను ప్లినరీ సమావేశంలో లక్షలాదిమంది కార్యకర్తల సమక్షంలో గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేయించారని భారతదేశంలోనే కాకా ప్రపంచంలోనే ఎవరు ఈవిధంగా రాజకీయాలు చేయరని చెప్పారు. ఉపముఖ్యమంత్రి పవన్ పై జగన్ చేసిన వ్యాఖ్యలని ఖండిస్తున్నామని అన్నారు. వైసీపీ కి ప్రతిపక్ష హోదా రాకపోవడానికి పనికిరాని వారిని మంత్రులను చేయడం, బూతులు తిట్టేవారికి ప్రాధాన్యం ఇవ్వడం, అభివృద్ధి చేయకపోవడం కారణమని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఆయనను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ వస్తుంటే ఫ్లైట్ కు కూడా పర్మిషన్ ఇవ్వలేదని, ఆయన రోడ్డు మార్గంలో వస్తే కోదాడ లో ఆపేశారని గుర్తు చేశారు. ఆ రోజు గంట కూడా పవన్ కళ్యాణ్ ను ఆపలేకపోయారని అది పవన్ స్టామినా అని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు మాములే అయినప్పటికీ వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. నారా లోకేష్ ను విమర్శించే అర్హత వైసీపీ నేతలకు లేదని తమ స్థాయి తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. మంత్రి లోకేశ్ విద్య విధానంలో నూతన పోకడలు తీసుకు వస్తున్నారని చెప్పారు. తన శాఖ కాకపోయినప్పటికీ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నారని చెప్పారు. అదే విధంగా టెస్లా లాంటి అతిపెద్ద కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడానికి కృషి చేస్తున్నారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here