Home Andhra Pradesh జగన్ మానసిక స్ధితి బాగోలేదు ...

జగన్ మానసిక స్ధితి బాగోలేదు వాసంశెట్టి సుభాష్‌, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి

6
0

విజయవాడ, తేదీ: 03.06.2025 వైసీపీ నేతలకు, కార్యకర్తలకు వైసీపీ పార్టీ మొదటి వర్ధంతి శుభాకాంక్షలు జగన్‌కు దమ్ముంటే లోకేష్‌తో డిబేట్‌కు రావాలి డైవర్షన్ పాలిటిక్స్ లో దిట్ట వైఎస్ జగన్ జగన్ బ్రతుకే వెన్నుపోటుతో ప్రారంభం జగన్ మానసిక స్ధితి బాగోలేదు వాసంశెట్టి సుభాష్‌, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి బడుగు బలహీన వర్గాల వెన్నుపోటుదారుడు వైఎస్ జగన్ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ తెలిపారు. తాడేపల్లి లో శ్రీ ఫార్య్చూన్ గ్రాండ్ హోటల్ లో మంత్రి వాసంశెట్టి సుభాష్ మంగళవారం మాట్లాడుతూ డైవర్షన్ పాలిటిక్స్ లో జగన్ కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. తెనాలిలో గంజాయి బ్యాచ్‌కు మద్దతుగా జగన్ వెళ్లటంతో రాష్ట్ర ప్రజలు జగన్‌ను కామెడీ పీస్ గా చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ కాలంలో లక్ష కోట్లు అప్పనంగా సంపాదించి సంవత్సరంన్నర కాలం జైలులో ఉన్న వెన్నుపోటుదారుడికి సమాజంలో ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. బాబాయికి సీటు ఇస్తానని చెప్పి చంపించిన వ్యక్తి జగన్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే 75 శాతం హామీలు నెరవేర్చిందన్నారు. డీఎస్సీ ద్వారా వేలాది పోస్టులు భర్తీ చేస్తున్నామన్నారు. రూ. 1200 కోట్లతో రోడ్లపై గుంతలు లేకుండా పూడ్చామన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రముఖ కియా పరిశ్రమ విస్తరణను అడ్డుకుని, అమర్ రాజా లాంటి బ్యాటరీ పరిశ్రమలను వెళ్లగొట్టేరన్నారు. సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వంలో 8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 5 లక్షల ఉద్యోగాలు లభించాయన్నారు. గత ప్రభుత్వంలో జగన్ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో 10 శాతం హామీలు కూడా నెరవేర్చలేదన్నారు. అలాంటి జగన్ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించటం సిగ్గుచేటన్నారు. జగన్ బ్రతుకే వెన్నుపోటుతో ప్రారంభం అయ్యిందన్నారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ ను అవసరం తీరాక పట్టించుకోలేదన్నారు. ఆయన పెద్ద దుర్మార్గుడు అని ఆమె తెలిపిందన్నారు. వెన్నుపోటుదారుడుగా ప్రత్యేక‌ స్ధానం జగన్ కే సొంతమన్నారు. చెల్లిని, తల్లిని అధికారంలోకి రాగానే బయటకు గెంటేయడం వెన్నుపోటు కాదా అన్నారు. గత 5 సంవత్సరాలు డార్క్ రూములో ఉండి 5 మందితో పాలన కొనసాగించారన్నారు. అందుకే ప్రజలు 11 స్థానాలకే పరిమితం చేసినా వైసీపీ నాయకులకు సిగ్గుగా కూడా లేదన్నారు. శవ రాజకీయాలు వైసీపీకి వెన్నతోపెట్టిన విద్య అని అన్నారు. గత 5 సంవత్సారల్లో చేసిన అవినీతి అంతం లేకుండా జరిగిందన్నారు. వీటన్నింటి ఫలితమే వైసీపీ నేతలకు వైసీపీ పార్టీ మొదటి వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. విజయవాడ వరదల సమయంలో రోడ్డు మీద నిలబడి బుడమేరు ఏంటనేది కూడా తెలీయకుండా మాట్లాడి ప్రజల్లో అపహాస్యం పాలయ్యారన్నారు. వైసీపీ బ్యానర్ వివాదం పై రామచంద్రాపురంలో కంప్లైంట్ ఇచ్చామన్నారు. సెక్షన్ 505, 504 ల గురించి తెలియదా అని వైసీపీ కార్యకర్తలను, నాయకులను ప్రశ్నించారు. తెలియకపోతే తెలుసుకోవాలని, లేకపోతే చట్టం తనపని తాను చేసుకు పోతుందన్నారు. పెట్టిన బ్యానర్ ను వెంటనే తొలగించకపోతే పెట్టినవారు శిక్షకు గురౌతారన్నారు. ఎస్సీ, ఎస్టీ పథకాలను తీసేసి, బడుగు బలహీన వర్గాల వెన్నుపోటుదారుడు జగన్ కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఆ వర్గాల ఓట్ల కోసం ముసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ఈ నిజాన్ని ఆయా వర్గాల ప్రజలు గమనించాలన్నారు. అధికారంలోకి రాకముందు మద్యాన్ని రద్దు చేస్తానని ప్రగల్బాలు పలికి అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ మద్యాన్ని అందించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడం నిజం కాదా అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధను చిన్నాభిన్నం చేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గాఢిన పెట్టామన్నారు. శవ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ వైసీపీ కి వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవ చేశారు. మంత్రి లోకేష్ తో పది నిముషాలు జగన్ డిబేట్ లో కూర్చోగల సత్తా ఉందా అని అన్నారు. దీనివల్ల డిబేట్ లో జగన్ కు ఉన్న నాలెడ్జ్ ఎంతో తేలిపోతుందన్నారు. జగన్ నిజ స్వరూపం తెలిసి, వారి మధ్య ఉన్న ఆర్థిక ఒప్పందాలతో భయపడి విజయసాయి రెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చి అప్రూవర్ గా మారాడన్నారు. వైసీపీ ఇంఛార్జ్ లు, కార్యకర్తలకు అనవసరపు బ్యానర్లు పెట్టి శిక్షలకు పాలవ్వద్దని విన్నపం చేస్తున్నారన్నారు. భిక్షగాడి అవతారం ఎత్తి బాబ్బాబు అని కేసులపై జగన్ అడుక్కుంటున్నాడన్నారు. తుని రైలు ఘటనపై గత ప్రభుత్వ హయాంలో కులాల మధ్య కుంపటి పెట్టారన్నారు. కూటమి ప్రభుత్వం కక్షలకు, ప్రతీకారాలకు తావు ఇవ్వకుండా అభివృద్ధి, సంక్షేమపై దృష్టి పెట్టిందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here