Home Political news జగన్ ఐదేళ్ల పాలనలో దివాళా తీసిన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ జగన్...

జగన్ ఐదేళ్ల పాలనలో దివాళా తీసిన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ జగన్ తన హయాంలో 10 లక్షల కోట్ల అప్పులు చేశారు

2
0

జగన్ ఐదేళ్ల పాలనలో దివాళా తీసిన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ

జగన్ తన హయాంలో 10 లక్షల కోట్ల అప్పులు చేశారు

సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టిన ఘనుడు జగన్

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్

వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్లపాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందని ప్రభుత్వ విప్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావ్ వ్యాఖ్యానించారు. గురువారం విజయవాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు.  జగన్‌మోహన్‌రెడ్డి హాయంలో చేసిన రూ.10 లక్షల కోట్ల అప్పుతో , ఏడాదికి రూ.71 వేల కోట్లు అసలు, లక్షా 40 వేల కోట్ల రూపాయల వడ్డీ చెల్లింపు భారం రాష్ట ఖజానాపై పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన ఏడు నెలల్లో ఆరోగ్యశ్రీ, ధాన్యం బకాయిలు, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ బకాయిలను ఇలా మొత్తం  సుమారు రూ.22 వేల కోట్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించిందన్నారు. విద్యవస్థను, వైద్యఆరోగ్య వ్యవస్థను నాశనం చేసారని దుయ్యబట్టారు.  ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ రూ.450 కోట్లు, చిక్కిలు, కోడిగుడ్లు రూ.256 కోట్లు, ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.1800 కోట్లు, ఉద్యోగులకు బకాయిలు రూ.20 వేల కోట్లు, ఇరిగేషన్‌ కాంట్రాక్టర్ల బకాయిలు రూ.19వేల కోట్లు, గృహనిర్మాణం బకాయిలు రూ.7,800 కోట్లు, ఉపాధి హామీ బకాయిలు రూ.2,100 కోట్లు ఇలా మొత్తం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ.1.40 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పారు. ఈ స్థాయిలో గతంలో ఏ ప్రభుత్వం ఇంతలా బకాయిలు పెట్టలేదని చెప్పారు. ఇలా తెచ్చిన అప్పులను ప్రభుత్వం ఆదాయం పెంచే సాగునీటి ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం వంటి వాటిపైన కాకుండా జగన్‌మోహన్‌రెడ్డి విలాసాలు, జల్సాలకు ఖర్చు చేశారని ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డి విలాసాలు, జల్సాలకు రూ.19,871.35 కోట్ల ప్రభుత్వ ధనం దుబారా చేశారన్నారు. రుషికొండపై విలావసవంతమైన భవనాల నిర్మాణానికి  రూ.600 కోట్లు, ప్రకటనల పేరుతో తన సొంత పత్రిక సాక్షి పత్రికకు దోచిపెట్టిన మొత్తం రూ.500 కోట్లు, తాడేపల్లి ప్యాలెస్‌ నిర్వహణకు ప్రజాధనం ఖర్చు రూ.15.25 కోట్లు ,పట్టాదారు పాస్‌ పుస్తకాలపై జగన్‌ ఫోటోలకు రూ.13 కోట్లను ఖర్చు చేశారని వెల్లడించారు. అయిదేళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగోటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ కేటాయింపులు, గనుల తవ్వకాలు, సోలార్‌కు అనుమతులు ఇలా ప్రతి దాంట్లో అశ్రిత పక్షపాతానికి ఒడిగట్టి లక్షల కోట్లను జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన అనుచరణగణం  దోచుకున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టిన ఘనత జగన్ దే అని విమర్శించారు.  టీడీఆర్‌ బాండ్లు, స్మార్ట్‌ మీటర్ల కోనుగోలు రేషన్‌ బియ్యంలో చేతివాటం చూపారని అన్నారు. చివరకు చిన్నారుల పోషణకు పెట్టే చిక్కిలు, కోడిగుడ్ల వంటి వాటిల్లో కూడా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఎమ్మెల్యే యార్లగడ్డ పేర్కొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఐయిదేళ్ళ పాలన రాష్ట్ర ప్రజల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here