జగన్ అవినీతి మబ్బులు చీల్చుకొని రాబోతున్నాయి చంద్రన్న కిరణాలు : టిడిపి ఎంపి అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని
తంగిరాల సౌమ్యతో కలిసి
అనాసాగరంలో ముగిసిన శివనాథ్
ప్రచారం
*భారీ కార్లతో సాగిన రోడ్ షో
*తంగిరాల సౌమ్యతో కలిసి కేశినేని శివనాథ్ ప్రచారం
*ప్రచారంలో పాల్గొన్నస్టార్ క్యాంపయినర్ వంగవీటి రాధకృష్ణ
*సైకో పోవాలి…సైకిల్ రావాలంటూ హోరెత్తిన నినాదాలు
*కాబోయే ఎంపి శివనాథ్ అంటూ కేరింతలు
నందిగామ: జగన్ తన అవినీతితో రాష్ట్రాన్ని చీకటి మయం చేశాడు. ఆ అవినీతి మబ్బులను చీల్చుకుని చంద్రన్న కిరణాలతో ఎన్నాళ్లగానో వేచి చూస్తున్న ఉదయం జూన్ 4వ రాబోతుందని టిడిపి ఎంపి అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. ఎన్నికల ప్రచారం ముగింపు రోజు శనివారం కేశినేని శివనాథ్ విజయవాడ పార్లమెంట్ సుడిగాలి పర్యటన చేశారు. శనివారం ఉదయం పశ్చిమంలో సుజనా చౌదరి రోడ్ షోలో, ఆ తర్వాత సెంట్రల్ లో బొండా ఉమామహేశ్వరరావు రోడ్ షోలో పాల్గొన్నారు. మధ్యాహ్నం నుంచి నందిగామ పట్టణంలో ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య, స్టార్ క్యాంపయినర్ వంగవీటి రాధకృష్ణతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. పట్టణంలోని టిడిపి పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఎన్నికల ప్రచార ర్యాలీ సీఎం రోడ్డు మీదుగా, చందర్లపాడు బస్టాండ్ మీదుగా, గాంధీ సెంటర్ మీదుగా, నందిగామ మెయిన్ రోడ్డ్, రథం సెంటర్, పాత బస్టాండ్ సెంటర్ మీదుగా అనాసాగరం గ్రామం వరకు సాగింది.
తంగిరాల సౌమ్య తో కలిసి పాల్గొన్న ఈ రోడ్ షోలో వంగవీటి రాధకృష్ణ సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. కేశినేని శివనాథ్, వంగవీటి అభిమానులు ఆనందోత్సాహలతో సైకో పోవాలి..సైకిల్ రావాలంటే నినాదాలు చేశారు. . ఎన్నికల ప్రచార రథం పై నుంచి విక్టరీ సింబల్ చూపిస్తూ కేశినేని శివనాథ్, వంగవీటి, తంగిరాల సౌమ్య సైకిల్ గుర్తుకి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున జరిగిన ఈ రోడ్ షో భారీ స్థాయిలో జరిగింది. ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో కార్లు…వందలాది మంది టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎంపి అభ్యర్థిగా ప్రకటించక ముందు నుంచే గత మూడేళ్లగా కేశినేని శివనాథ్ ఎన్టీఆర్ జిల్లాలో తన సేవకార్యక్రమాలతో ఏడు నియోజకవర్గాల ప్రజలకు చేరువయ్యారు. పార్టీ లో చురుగ్గా తిరుగుతున్న నాటి నుంచి టిడిపి కార్యకర్తలు, నాయకుల్లో కొత్త ఉత్సాహం నింపారు. సామర్థత, సామర్థ్యం గల నాయకుడిగా ప్రజల నుంచి, పార్టీ నాయకుల నుంచి పేరు సంపాదించుకుని చంద్రబాబు ప్రోత్సాహంతో విజయవాడ ఎంపి అభ్యర్థిగా బరిలో నిలిచాడు. జిల్లాలోని 250కి పైగా గ్రామాల్లో పర్యటించిన కేశినేని శివనాథ్ అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. కుల మత వర్గ బేధం లేకుండా అనేక ఆత్మీయ సమ్మేళనాలలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో చివరి ప్రచార సభలో కేశినేని శివనాథ్ భావోద్వేగంగా మాట్లాడారు.
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో సామాన్యుడి జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తానన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు, వేద్రాది ఎత్తిపోతల పథకం మర్మమత్తులు, తిరువూరు నియోజకవర్గంలో తాగు నీటి సమస్య అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని చెప్పారు. జగన్ నియంతృత్వ దోరణిని రాష్ట్ర ప్రజలే కాదు. జగన్ తల్లి విజయమ్మ హర్షించటం లేదు. కడపలో వైసిపిని ఓడించి షర్మిలాను గెలిపించాలని అభ్యర్థించింది.. తల్లి, చెల్లి కాదన్న జగన్ ను రాష్ట్ర ప్రజలు కూడా వద్దనుకుంటున్నారని అన్నారు. ఐదేళ్లుగా జగన్ పాలన మాఫియా పాలనగా సాగింది…యువతను గంజాయి, మత్తు పదార్ధాలకు అలవాటు చేశాడు.ఈ పరిస్థితుల్ని చంద్రబాబు అధికారంలోకి రాగానే చక్కదిద్దుతారని తెలియజేశారు. లాండ్ టైట్లింగ్ పేరుతో నల్ల చట్టాన్ని తీసుకు వచ్చి ప్రజల ఆస్తులను కొల్లగొట్టాలని చూసిన జగన్ ప్రణాళికలు ప్రజలు అర్ధం చేసుకున్నారు. అందుకే ఎన్డీయే కూటమికి ఇంత ప్రజాదరణ లభించిందన్నారు. చంద్రబాబు ప్రమాణాస్వీకారం కాగానే తన రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కోసమే చేస్తారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా రాజధాని అమరావతి నిర్మాణం జరగాలన్న అనుకున్న లక్ష్యం చేరాలంటే ఎన్డీయే కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. అలాగే నందిగామ నియోజకవర్గంలో తంగిరాల సౌమ్యతో పాటు, తనకి సైకిల్ గుర్తు పై ఓటువేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి,జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.