Home Andhra Pradesh జగద్గురుఆదిశంకరాచార్యనగరోత్సవం

జగద్గురుఆదిశంకరాచార్యనగరోత్సవం

3
0

 శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ.

02 మే 2025

 జగద్గురుఆదిశంకరాచార్యనగరోత్సవం

జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి సందర్బంగా శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో మే 02 సాయంత్రం 6గంటలకు నగరోత్సవ ఊరేగింపు మహామండపం నుండి వేద మంత్రాలు, మంగళ వాయిధ్యాలు, కోలాట నృత్యాలు, కూచిపూడి నృత్య కళాకారుల అభినయం,భజన సంకీర్తనలు, ఆది శంకరుల వేషధారణతో చిన్నారుల కోలాహలంతో రంగరంగ వైభవం గా ప్రారంభమైంది.

ఆలయ స్థానాచార్య శ్రీ వి. శివ ప్రసాదశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు,అర్చకులు, ఆలయసిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగింపు కనకదుర్గా నగర్, రధమ్ సెంటర్, వినాయక ఆలయం, కెనాల్ రోడ్ నుండి మరళా దేవస్థానం చేరుకుంది.

శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో శ్రీ చక్రం ప్రతిష్టించి, అమ్మవారి ఆలయంతో విశేషఅనుబంధం గల ఆది శంకరుల జయంతి సందర్బంగా విశేషపూజలు, నగరోత్సవం ప్రత్యేక శ్రద్దతో నిర్వహించడమైనది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here