13-03-2025
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ.
ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ : ప్రజలందరికీ విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) హోలీ శుభాకంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సమైక్యతను చాటిచెబుతుంది. గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలు నిస్తేజంగా పండుగలు, ఉత్సవాలు, సంబరాలు జరుపుకున్నారు. ఎన్డీయే కూటమి అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా వున్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అనుసరిస్తున్న ప్రజా పాలనలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి ఫలాలు అందరి కుటుంబాల్లో సప్తవర్ణ రంగుల శోభను నింపుతున్నాయి
ఈ రంగుల పండుగ మనందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావటంతో పాటు సుఖసంతోషాలు నింపాలి. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాభివృద్దికి అందిస్తున్న సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ది దిశగా పయనిస్తుంది.
ప్రేమ, ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే హోలీ రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఆకాంక్షించారు. సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ పద్ధతులతో రంగుల పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు.