ఉయ్యూరు
చంద్రబాబు పాలనలోనే యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు:తే.దే.పా ఉపాధ్యక్షులు వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్
.
తెలుగుదేశం కూటమి విజయంలో కీలకపాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు y.v.b రాజేంద్ర ప్రసాద్ ని రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నాయకులు అదే విధంగా పమిడిముక్కల మండలం మంటాడ,ధూళి పూడిపాలెం యువత రాజేంద్ర ప్రసాద్ ని సత్కరించి అభినందనలు తెలిపారు,
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ప్రక్క రాష్ట్రాలకు వలస వెళ్ళే పరిస్థితి ,ఉండేదని కానీ నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం లో యువత కు పెద్దపీట వేసి పెద్ద ఎత్తున పరిశ్రమలను ,ఐటి కంపెనీలకు రాష్ట్రానికి తీసుకువచ్చి తద్వారాఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించే దిశగా ప్రణాలికలు సిద్ధం చేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సయ్యద్ అజ్మతుల్లా,ఆకునూరు సర్పంచ్ గొలివసంతరావు,సాయిపురం సర్పంచ్ బాషా,ఆర్యవైశ్య నాయకులుv.ఆంజనేయులు,శేషు,తేజా,వెంకటేశ్వరావు,మున్నా,నాయకులుకాకర్ల నాని,సనకా కిరణ్,షఫీ,బాషా,గుర్నాధం,శ్రీను,బాజాని తదితరులు పాల్గొన్నారు.