విజయవాడ
06-12-2024
ఘనంగా డా బి ఆర్ అంబెడ్కర్ వర్ధంతి కార్యక్రమం
అంబెడ్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పించిన మాజి మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ శిరంశెట్టి పూర్ణ
మాజి మంత్రి వెలంపల్లి కామెంట్స్
భారతదేశ అభివృద్ధికి, మనుగడకు నాడు భారత రాజయంగాన్ని రచించిన మహనీయుడు డా బి ఆర్ అంబెడ్కర్ – వెలంపల్లి
ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమ పధకాలు లేకుండా కక్షపూరితంగా కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది – వెలంపల్లి
అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్న అమ్మ ఒడి, రైతు భరోసా వంటి పధకాలు అమలు చేయకుండా అన్ని వర్గాల వారిని కూటమి ప్రభుత్వం మోసం చేసింది – వెలంపల్లి
కూటమి పరిపాలనలో ఆంధ్రరాష్ట్రం అభివృద్ధికి నోచుకోకుండా, సంక్షేమ పధకాల అమలుకు నోచుకోకుండా ప్రజలు చాల ఇబ్బందులు పడుతున్నారు – వెలంపల్లి
డా బి ఆర్ అంబెడ్కర్ ఆశయాలు, ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లాలంటే కేవలం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కే సాధ్యం – వెలంపల్లి
స్థానిక 55వ డివిజన్ లోని నైజంగేట్ సెంటర్ వద్ద గల డా బి ఆర్ అంబెడ్కర్ విగ్రహం వద్ద స్థానిక డివిజన్ కార్పొరేటర్ శిరంశెట్టి పూర్ణ చంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించిన డా బి ఆర్ అంబెడ్కర్ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి డా బి ఆర్ అంబెడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించి డా బి ఆర్ అంబెడ్కర్ ఈ దేశానికీ అందించిన సేవలను స్మరించుకున్నారు అనంతరం పేదలకు పండ్లు పంపిణి చేసారు
ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 55 వ డివిజన్ లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ శిరంశెట్టి పూర్ణ ఆధ్వర్యంలో డా బాబా సాహెబ్ అంబెడ్కర్ వర్ధంతి కార్యక్రమం వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో కలిసి నిర్వహించుకోవడం జరిగిందన్నారు. భారతదేశ అభివృద్ధికి, మనుగడకు నాడు భారత రాజయంగాన్ని రచించిన మహనీయుడు డా బి ఆర్ అంబెడ్కర్ గారని కొనియాడారు. నేడు భారత దేశంలోని అన్ని ప్రతి రాష్ట్రంలో అంబెడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ముందుకు వెళ్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమ పధకాలు లేకుండా కక్షపూరితంగానే కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుందన్నారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి కుటుంబం లో ఒక్కరికి అమ్మఒడి ఇచ్చేవారు కూటమి పార్టీలు ఎన్నికలలో కుటుంబంలో ప్రతి ఒక్కరికి అమ్మఒడి పధకం ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేపించుకొని అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్న అమ్మ ఒడి ఇవ్వకుండ ఈ సంవత్సరం అమ్మఒడి పధకం ఇవ్వకుండా విద్యార్థులను కుటమీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రైతు భరోసా పధకం పేరుతొ రైతులకు జగన్ మోహన్ రెడ్డి పదమూడున్నర వేలు ఇస్తే కూటమి పార్టీలు 20 వేలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్న ఇంతవరకు రైతులకు డబ్బులు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఇటువంటి కూటమి పరిపాలనలో ఆంధ్రరాష్ట్రం అభివృద్ధికి నోచుకోకుండా, సంక్షేమ పధకాల అమలుకు నోచుకోకుండా ప్రజలు చాల ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. డా బి ఆర్ అంబెడ్కర్ ఆశయాలు, ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లాలంటే కేవలం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కే సాధ్యమన్నారు
ఈ కార్యక్రమంలో వైసిపి పశ్చిమ కార్పొరేటర్లు బాలసాని మణెమ్మ, యరడ్ల ఆంజనేయ రెడ్డి, Md ఇర్ఫాన్, బాపతి కోటి రెడ్డి, షేక్ హయత్ మాజీ చైర్మన్లు కర్నాటి రాంబాబు, మనోజ్ కొఠారి, మాజీ డైరెక్టర్ లు, SC సెల్ జిల్లా అధ్యక్షులు పొలిమెట్ల శరత్, SC సెల్ నాయకులు, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు