Home public news గ్రూప్-2 పరీక్షకు 92 శాతం మంది హాజరు

గ్రూప్-2 పరీక్షకు 92 శాతం మంది హాజరు

3
0

 గ్రూప్-2 పరీక్షకు 92 శాతం మంది హాజరు

గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తెలిపింది. ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 92,250 మంది అభ్యర్థుల్లో 86,459 మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా.. వారిలో 92శాతం మంది హాజరయ్యారని అధికారులు వెల్లడించారు.

 ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ప్రభావం

గ్రూప్-2 ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వం సూచించినా ఏపీపీఎస్సీ మాత్రం యథావిధిగా పరీక్ష నిర్వహించింది. పరీక్ష రాసే అభ్యర్థులు డిగ్రీ పూర్తిచేసిన వారని, వాయిదా వేస్తే అది శాసనమండలి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఏపీపీఎస్సీ కార్యదర్శి శనివారం సాయంత్రం ప్రభుత్వానికి లేఖరాశారు. శాసనమండలి ఎన్నికలు నిర్వహించే కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోనే ఏపీపీఎస్సీ ఉన్న విషయాన్ని అందులో గుర్తుచేశారు. వాయిదా నిర్ణయం డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులను ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని అందులో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here