Home Andhra Pradesh గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేకు భూములు ఇచ్చిన రైతుల సమస్యలపై కలెక్టర్ లక్ష్మీశ ని కలసిన...

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేకు భూములు ఇచ్చిన రైతుల సమస్యలపై కలెక్టర్ లక్ష్మీశ ని కలసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు

4
0

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేకు భూములు ఇచ్చిన రైతుల సమస్యలపై కలెక్టర్ లక్ష్మీశ ని కలసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, జి.కొండూరు, 13.06.2025.

నాగపూర్ నుంచి అమరావతి వరకు నిర్మిస్తోన్న గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి భూములను ఇచ్చిన రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ ని శుక్రవారం విజయవాడలోని కలెక్టరేట్లో కలసి ప్రత్యేకంగా కలసి విజ్ఞప్తి చేశారు. బి ఫామ్ భూములు ఇచ్చిన రైతులకు కూడా వెంటనే నష్టపరిహారం విడుదల చేయాలని కోరారు. రైతుల సమస్యలను సమగ్రంగా పరిష్కరించాలని కోరారు. దీనిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. తగు చర్యలు చేపట్టి రైతుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని అన్నారు.

ఇదిలా ఉండగా జాతీయ రహదారుల విభాగం అధికారులతో కూడా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మైలవరం నియోజకవర్గంలోని పలు సమస్యలను ప్రస్తావించారు. సాధ్యమైనంత త్వరలో ఆయా సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని ఎన్.హెచ్ విభాగం అధికారులు పేర్కొన్నారు. జి.కొండూరు మండల పరిధిలోని మునగపాడు, తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here