Home Andhra Pradesh గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి.. యార్లగడ్డ

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి.. యార్లగడ్డ

2
0

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి.. యార్లగడ్డ

కొండపావులూరు లో ఎన్డీఆర్ఎఫ్ వద్ద వంతెన నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ…

గన్నవరం :
గన్నవరం మండలం కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ క్యాంపస్ సమీపంలో 1కోటి 50 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న వంతెన పనులకు శంకుస్థాపన చేసిన గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్నున్న వంతెనకు ఎన్టీఆర్ ఎఫ్ ఉన్నతాధికారుల సమక్షంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ
ఎన్డీఆర్ఎఫ్ లాంటి ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ సంస్థ నా నియోజకవర్గంలో ఉండడం నాకు చాలా గర్వంగా ఉంది.
సుమారు నాలుగు నెలల క్రితం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎన్ డి ఆర్ ఎఫ్ కు రావడం జరిగింది. మనకు ఇటీవల సంబంధించిన వరదలు విపత్కర పరిస్థితుల్లో ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది ద్వారా ఎంతో మందిని కాపాడాం. వరదల సమయంలో ఎన్టీఆర్ ఎఫ్ క్యాంపస్లో 4-5 బోట్లు ఉన్న పరిస్థితి. తర్వాత పంజాబ్ నుంచి బోట్లను తెప్పించడం పరిస్థితులు చూశాం. ఎన్ డి ఆర్ ఎఫ్ ఈ రాష్ట్రంలో ఎక్కడ విపత్కర పరిస్థితి నెలకొన్న ముందుండి విపత్తుల నుండి ప్రజలను రక్షించడానికి పనిచేస్తుంది.
గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండంగానే ఎన్టీఆర్ కు స్థలం కేటాయించిన పరిస్థితి.
తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ సంస్థలను ఓపెన్ చేయడానికి అమిత్ షా ఇక్కడికి వచ్చారు. సమాజ హితం కోసం పనిచేస్తున్న ఎన్డీఆర్ఎఫ్కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఈ ప్రభుత్వం ముందుంటుంది.
విపత్కర పరిస్థితుల్లో అందర్నీ రక్షించే ఎన్ డి ఆర్ ఎఫ్ కు వారు వెళ్లే దారిలో ఈ వంతెనను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. ఈ కార్యక్రమం లో గన్నవరం కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here