18-07-2024
గ్రామాభివృద్ధే ప్రభుత్వం లక్ష్యం : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
వెల్లంకి-జుజ్జూరు రోడ్డు శంకుస్థాపన
మండల నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం
వెల్లంకి : గత ఐదేళ్లుగా వైసిపి గవర్నమెంట్ లో ప్రజలు అనుభవించిన బాధలు ఎన్డీయే ప్రభుత్వ గెలుపుకి తార్కాణం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాష్ట్రాభివృద్ధితో పాటు, గ్రామీణాభివృద్ది కూడా లక్ష్యమని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం వెల్లంకి గ్రామంలో గురువారం జరిగిన వెల్లంకి నుండి జుజ్జూరు వరకు రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి పాల్గొన్నారు. ముందుగా
ఎన్టీఆర్ విగ్రహానికి పూలవేసి నివాళులర్పించారు.
ఎంపి నిధుల నుంచి కోటి డెబ్బై లక్షల రూపాయల నిధులు విడుదల చేయటం జరిగింది. ఈ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ముందుగా శిలాపలకాన్ని ఎంపి కేశినేని శివనాథ్ ఆవిష్కరించారు. అనంతరం ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరా సౌమ్య కొబ్బరికాయలు కొట్టి రోడ్డు శంకుస్థాపన పనులు ప్రారంభించారు.
అనంతరం వెల్లంకి గ్రామంలో ఏర్పాటు చేసిన వీరులపాడు మండల పార్టీ నాయకుల, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎంపిగా గెలిచిన తర్వాత వెల్లంకి గ్రామానికి మొదటిసారిగా అభివృద్ది కార్యక్రమానికి హాజరుకావటం ఎంతో ఆనందంగా వుందన్నారు. వెల్లంకి గ్రామంలో టిడిపికి భారీ మెజార్టీ అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపు ప్రజలందరి గెలుపు అని చెప్పారు. మరో రెండేళ్లలో అందరి కలల రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్, వేదాద్రి ఎత్తిపోతల పథకం ద్వారా తాగు నీరు, సాగు నీరు అందిస్తామన్నారు. రాబోయే గ్రామ పంచాయితీ ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గంలోని అన్నిపంచాయితీల్లో గెలుపు సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు, నాయకులకి, కార్యకర్తలకి ఏ అవసరం వచ్చిన అన్ని సమయాల్లో అందుబాటులో వుంటానని తెలియజేశారు.
ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ వైసిపి ఐదేళ్లలో ఒక రోడ్డు కూడా వేయలేకపోయిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలన్నర రోజుల్లోనే గ్రామాల్లో రోడ్లు వేయించటం జరుగుతుందని తెలియజేశారు. అలాగే మండల పార్టీ నాయకులు, కార్యకర్తలను కలవటం ఆనందంగా వుందన్నారు.
ఈ కార్యక్రమంలో వీరులపాడు మండల పార్టీ అధ్యక్షుడు కొండ్ర గుంట శ్రీనివాస్, కంచికచర్ల మండల పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు, జిల్లా తెలుగు రైతు ఉపాధ్యక్షులు రాములూరి మధుసూధనరావు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు భరతరెడ్డి, రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి మల్లెగంటి రోశయ్య, రాష్ట్ర బిసి సెల్ కార్యదర్శి తమ్మిరెడ్డి వీరబాబు, జిల్లా ఎస్సీ సెల్ నాయకులు గురజాల అజేయ్ కుమార్, వెల్లంకి గ్రామ పార్టీ అధ్యక్షులు యరం రెడ్డి వెంకటేశ్వరరావు, మాజీ సోసైటీ అధ్యక్షులు యర్రంశెట్టి వెంకటేశ్వరరావు, వెల్లంకి గ్రామ సర్పంచి హుస్సెన్ బి, మాజీ సర్పంచ్ నెమలపురి అమరయ్య , మాజీ ఎం.పి.టి.సి ఆవుల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.