26-1-2025
విజయవాడ గౌడు జేఏసీ సమావేశం గాంధీనగర్ ప్రెస్ క్లబ్
గీత వృత్తిదారులకు మద్యం షాపులు విషయంలో ప్రభుత్వం కేటాయించిన 10% రిజర్వేషన్ విషయంలో గౌడ కులస్తులకు అన్యాయం చేసిందని గౌడ సేన జాతీయ అధ్యక్షులు మోర్ల ఏడుకొండలు గౌడ్ ఆరోపించారు.
10 శాతం రిజర్వేషన్ తో పాటు, 50% ఫీజు సబ్సిడీ ప్రకటించటం హర్షించదగ్గ విషయం అయినా గౌడ కులస్తులను ప్రాంతాల వారీగా విభజించి అన్యాయం చేసిందని స్పష్టం చేశారు.
ఆదివారం జై గౌడ సేన జాతీయ అధ్యక్షుడు మొర్ల ఏడుకొండలు గౌడ్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్క్లబ్లో గౌడ సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏడు కొండలు గౌడ్ మీడియాతో మాట్లాడుతూగీత కార్మికులకు ప్రభుత్వం 20 శాతం రిజర్వేషన్ ఇస్తానని 10% మాత్రమే రిజర్వేషన్ ఇవ్వటం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ తో పాటు 50 శాతం ఫీజు సబ్సిడీ ప్రకటించడం హర్షించదగ్గ విషయమే అయినా, ప్రాంతాలవారీగా గౌడ కులస్తులను విభజించటం సరైన విధానం కాదన్నారు. గౌడ ఉపకులాలైన శెట్టిబలిజ, శ్రీసైన, ఈడిగ, అను నాలుగు కులాలు ఒకే గీత కులంలో ఉండి, గీత వృత్తిపై ఆధారపడి ఉన్నారని, వీరు అందరికీ అవకాశం కల్పించడం ఆహ్వానించి దగ్గర విషయం అన్నారు. జీవో నెంబర్ 16 లో ఉన్న గౌడ కులాన్ని గౌడ, గేళ్ళ, గేముల్లా, గౌడ్ అని ప్రాంతాలవారీగా విభజించి, మద్యం షాపులకు టెండర్లలో పొందుపరిచి గౌడ బిడ్డలకు అయోమయంలో కి నెట్టింది అన్నారు. గౌడ, గేళ్ళ, గముళ్ళ, గౌడ్ కులాలు అందరూ గౌడ కులం కిందకు వస్తారని, వారందరినీ ఒకే కులం గా పరిగణించాలని గౌడ జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యామా మురళి గౌడ్, గౌడ సేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రంగారావు గౌడ్, రామకృష్ణ గౌడ్, కోసూరి సోమయ్య గౌడ్, జుజ్జురి సతీష్ గౌడ్, పాగోలు గోపి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.