సత్తెనపల్లి నియోజకవర్గం, ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామ సర్పంచ్ గోపు అప్పమ్మ వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు కండువా కప్పి సాదరంగా
పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ , పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ , రాష్ట్ర అధికార ప్రతినిధి పగడాల శివపార్వతి తదితరులు పాల్గొన్నారు.