Home Political news గోపిరెడ్డి అనుచరులపై జ్యుడీషియల్ ఎంక్వైరీకి సూలం రమేష్ డిమాండ్ జగన్ ప్రభుత్వంలో భూ అక్రమాలపై...

గోపిరెడ్డి అనుచరులపై జ్యుడీషియల్ ఎంక్వైరీకి సూలం రమేష్ డిమాండ్ జగన్ ప్రభుత్వంలో భూ అక్రమాలపై పలువురు బాధితులు మొర

3
0

 *25.11.2024*

గోపిరెడ్డి అనుచరులపై జ్యుడీషియల్ ఎంక్వైరీకి సూలం రమేష్ డిమాండ్

జగన్ ప్రభుత్వంలో భూ అక్రమాలపై పలువురు బాధితులు మొర

జగన్ ప్రభుత్వం ఫీజు చెల్లించకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు భీమవరం విద్యార్థిని ఆవేదన

తన కొడుకు చావుకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఓతల్లి ఫిర్యాదు

ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్, రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి చైర్ పర్సన్ పీతల సుజాత, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు రిష్వంత్ లు అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. వారి సమస్యలు విని పరిష్కరించేందుకు కృషి చేశారు.

• నరసరావుపేట పట్టణం స్టేషన్ రోడ్డులో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయస్వామి గుడిలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అండదండలతో ధ్వజస్తంభం, దానికి సంబంధించిన ఇత్తడి సామన్లను దొంగిలించి అమ్ముకున్న వ్యక్తులపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వెయాలని.. సామన్లు కొట్టేసిన అక్రమార్కుడిని ఆలయ ట్రాస్టిగా నియమించారని అతడిని తొలగించాలని పట్టణానికి చెందిన సూలం రమేష్ అనే వ్యక్తి నేతలకు విజ్ఞప్తి చేశాడు. 

• జగన్ ప్రభుత్వంలో రీ సర్వే జరిగినప్పుడు అధికారులకు లంచం ఇచ్చి దొంగ పాస్ పుస్తకాలు చేయించుకుని తమ వారసత్వ భూమిని కె. నాగేష్ నాయక్ ఆనే వ్యక్తి తన పేరుపై ఆన్ లైన్ చేయించుకున్నాడని.. ఆ భూమి వంద సంవత్సరాల నుండి తమ ఆధీనంలో ఉందని.. అధికారులు విచారించి తమకు న్యాయం చేయాలని నంద్యాల జిల్లా పాములపాడు మండలం భానుముక్కల గ్రామానికి చెందిన చిన్న నాగన్న విజ్ఞప్తి చేశాడు. 

• నంద్యాల జిల్లా ప్యాపిలికి చెందిన రాం గోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేస్తూ.. తాను టీడీపీలో తిరుగుతున్నానని తనపై వైసీపీ నాయకులు అక్రమ కేసులు పెట్టారని.. వాటిని తొలగించేలా చూడాలని అలాగే.. తనకు ఉపాధి కల్పించాలని నేతలకు అర్జీ ఇచ్చి వేడుకున్నాడు.                                                        

• డబ్బులు తీసుకుని అక్రమంగా రికార్డులు మార్చిన వీఆర్వోపై చర్యలు తీసుకుని.. తమ భూమి తమకు దక్కేలా చూడాలని కాకినాడ జిల్లా రౌతుల పూడి మండలం మల్లవరం గ్రామానికి చెందిన యొన్ముల చిట్టెమ్మ అనే మహిళ నేడు గ్రీవెన్స్ లో నేతలకు విజ్ఞప్తి చేశారు. 

• విశాఖపట్నం తిక్కవానిపాలెంకు చెందిన యశోద విజ్ఞప్తి చేస్తూ..హాసిని అనే అమ్మాయి కనిపించకపోవడంతో తన కొడుకును పోలీస్ స్టేషన్ ను కు తీసుకెళ్లి.. తన కొడుక్కి ఆ అమ్మాయి గురించి ఏమీ తెలియకపోయినా దారుణంగా కొట్టారని.. దాంతో తన 19 ఏళ్ల కొడుకు చనిపోయాడని.. తన కొడుకు చావుకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆమె నేడు గ్రీవెన్స్ లో నేతలను వేడుకుంది. 

• కృష్ణా జిల్లా కోడూరు మండలం లింగారెడ్డి పాలెం దళితవాడ గ్రామానికి చెందిన పలువురు విజ్ఞప్తి చేస్తూ.. దాసరి రామయ్య అనే వ్యక్తి పంచాయతీ రోడ్డుకు కర్రలను అడ్డంగా కట్టి ప్రజలను రోడ్డుపై తిరగనీయకుండా ఇబ్బందికి గురిచేస్తున్నాడని.. అతనిపై చర్యలు తీసుకుని దారికి ఉన్న ఆడ్డంకి తొలగించాలని విజ్ఞప్తి చేశారు.

• పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఇజ్జపురెడ్డి తేజో సౌందర్యవాణి విజ్ఞప్తి చేస్తూ.. తాను భీమవరంలోని బీవీ కాలేజ్ లో MCA పూర్తి చేశానని.. గత ప్రభుత్వం తనకు చెల్లించాల్సిన ఫీజు చెల్లించకపోవడంతో కాలేజీ వారు తన సర్టిఫికేట్లు ఇవ్వడంలేదని.. దయచేసి తన సర్టిఫికేట్లు ఇప్పించాలని వేడుకుంది.  

• ప్రకాశం జిల్లపెద్దారవీడు మండలం యస్. కొత్తల్లో గ్రామానికి చెందిన చిన్న వెంకటరెడ్డి విజ్ఞప్తి చేస్తూ.. గత టీడీపీ ప్రభుత్వంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పశువులకు మినీ గోకులం పథకంలో భాగంగా తాను రేకుల షెడ్ నిర్మించుకున్నానని.. కాని తనకు ఇంతవరకు ఎటువంటి బిల్లు రాలేదని.. దాయచేసి తనకు బిల్లు మంజూరు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. అలాగే తమ చెరువులో చిల్ల చెట్లు పెరగడం వలన అక్కడ పందులు చేరి సమీప పంటపొలాలను నాశనం చేస్తున్నాయని.. చెరువులోని చిల్ల చెట్లను తొలగించాలని విజ్ఞప్తి చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here