Home Political news గుడిలో ఇత్తడి సామాన్లు కొట్టేసిన గోపిరెడ్డి అనుచరులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ...

గుడిలో ఇత్తడి సామాన్లు కొట్టేసిన గోపిరెడ్డి అనుచరులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ నేతను కిడ్నాప్ చేసిన వైసీపీ రౌడీలు

2
0

 07.10.2024

గుడిలో ఇత్తడి సామాన్లు కొట్టేసిన గోపిరెడ్డి అనుచరులు

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ నేతను కిడ్నాప్ చేసిన వైసీపీ రౌడీలు

ఐదు నెలలుగా జీతాలు అందడంలేదని డైలీవేజ్ వర్కర్లు విన్నపం

ఆట స్థలంకోసం విడిచి పెట్టిన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వైసీపీ నేతలు

వివిధ సమస్యలపై పోటెత్తిన అర్జీదారులు.. అర్జీలు స్వీకరించిన నేతలు

నాటి ఎమ్మెల్యే గొప్పిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి అండదండలతో వైసీపీ నాయకులు బొగ్గరంమూర్తి అతని అన్న నరసింహకుమార్ లు నరసరావుపేట పట్టణంలోగల స్టేషన్ రోడ్డులోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామి గుడి పునర్నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేయడానికి తెచ్చిన ద్వజస్తంభం, దానికి సంబంధించిన తొడుగులు ఇత్తడి సమానును అమ్ముకున్నారని.. గుడి దేవాదాయ శాఖ పరిధిలో ఉందని.. గుడి పునర్నిర్మాణంకు నిధులు ఖర్చుపెట్టినందుకు తన పేరు మీద శిలాఫలకం వేయిస్తే దాన్ని పగలగొట్టి గుడిలోకి వెళ్లకుండా తమను కొట్టి అక్రమ కేసులు పెట్టి తమనే జైలుకు పంపారని.. దీనికి సంబంధించి సాక్ష్యాలు వీడియోలు కూడా ఉన్నాయని వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితుడు సూలం రమేష్ నేడు గ్రీవెన్స్ లో నేతలు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, రెడ్డి సుబ్రహ్మణ్యంలకు వినతిని ఇచ్చి న్యాయం చేయాలని వేడుకున్నారు. వినతి స్వీకరించిన నేతలు పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.   

• అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన కె. అబ్దుల్ రహిమాన్ అర్జీని ఇస్తూ.. 2020 మున్సిపల్ ఎన్నికలకు రాయచోటిలోని 31వ వార్డుకు కౌన్సిలర్ గా టీడీపీ అభ్యర్థిగా పోటీచేయుటకు నామినేషన్ పత్రం తీసుకొని అధికారి వద్దకు వెళితే అధికారి ముందే వైసీపీ నేతలు నామినేషన్ పత్రాన్ని చించి తమను కొట్టారని పోలీసులు పక్కనే ఉన్నా చూస్తూ ఉండిపోయారని. మళ్లీ ఎలక్షన్ నిర్వహించమని ఎన్నికల కమిషన్ చైర్మన్ కలెక్టర్ కు ఆదేశించడంతో 2021 మార్చిలో నామినేషన్ వేయమని కలెక్టర్ ద్వారా నోటీసు రావడంతో నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా వైసీపీ నేతలు తనను కిడ్నాప్ చేసి నామినేషన్ వేయకుండా చేశారని నేడు నేతలకు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని వేడుకున్నాడు. 

• అద్దంకి మండలం అద్దంకి గరటయ్య కాలనీకి చెందిన మానం నాగేశ్వరరావు విజ్ఞప్తి చేస్తూ.. తన పొలంలో తుమ్మ చెట్లను నరకగా.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే… వారు పట్టించుకోకపోవడంతో పొలంలో ఉన్న సుబాబులు, జామాయిల్ చెట్లను రాత్రికి రాత్రి ధ్వంసం చేశారని.. దీనిపై యర్రా హనుమంతరావును నిలదీస్తే.. పొలం దగ్గరకు వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని.. తన భూమిని కొట్టేసేందుకు యత్నిస్తున్నాడని.. తనపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశాడు. 

• రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖలో 347 మంది డైలీవేజ్ వర్కర్స్ ను ఆప్కాస్ లో చేర్చమని సంక్షేమ శాఖ నుండి మార్చి నెల 2024లో ఉత్తర్వులు వెలువడ్డాయని ఇంతవరకు ఆ ఉత్తర్వుల మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఐదు నెలలుగా జీతాలు అందక ఇబ్బంది పడుతున్నామని జీతాలు అందించి న్యాయం చేయాలని వేడుకున్నారు. 

• TDR నిలిపివేయుట వలన టీడీఆర్ ఫ్లోర్ రిలాక్సేషన్ తీసుకొనుటకు అవకాశం లేనందున ప్లాన్ పెట్టుటకు గాని భవన నిర్మాణం చేయుటకు గాని అవకాశం లేకపోవడంతో బిల్డర్స్ దగ్గర పనిచేస్తున్న కాంట్రాక్ట్ మేస్త్రీలు, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్ తో పాటు 18 రకాల చేతి వృత్తులవారు జీవనాధారం కోల్పోతున్నారని వెంటనే సమస్యను పరిష్కరించాలని డవలపర్ శ్రీ హరి అనే వ్యక్తి గ్రీవెన్స్ నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థించాడు

• తమకు తెలియకుండా తమ భూమిని వేరోకరికి విక్రయించారని.. దానిపై తహశీల్దార్ వద్దకు వెళ్లి అడగ్గా.. పట్టించుకోవడంలేదని ఏలూరు జిల్లా ఏలూరు కు చెందిన కత్తుల రాజేంద్ర ప్రసాద్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. 

• తమ పొలం 0.44 సెంట్ల కోసం ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరిగి తమకు న్యాయం చేయాలని అడిగితే అధికారులు పట్టించుకోవడంలేదని.. కోర్టుకు వెళ్లమని సలహాలు ఇస్తున్నారని.. అధికారులు ఇంకా వైసీపీ నేతలకు సహకరిస్తున్నారని.. దాదాపు రూ. కోటి విలువ చేసే స్థలం అని.. తమకు న్యాయం చేయాలని కదిరి మండలం యర్రగుంటపల్లి గ్రామానికి చెందిన ఉత్తేమ్మ నేడు గ్రీవెన్స్ లో నేతలను కలిసి మొరపెట్టుకుంది. 

• అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన అబ్దుల్ రహీమ్ విజ్ఞప్తి చేస్తూ.. ఇందిరమ్మ ఇళ్ల మధ్య పేదల బడి, ఆట స్థలాలకోసం విడిచి పెట్టిన ప్రభుత్వ స్థలాన్ని వైసీపీ నేతలు కబ్జా చేశారని… ప్రభుత్వ స్థలం అని పెట్టిన బోర్డును తొలగించి కబ్జా చేశారని వారి కబ్జా నుండి ఆ స్థలాన్ని విడిపించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. అలాగే రాయచోటిలోని ఇందిరమ్మకాలనీకి చెందిన పలువురు విజ్ఞప్తి చేస్తూ.. తమ కాలనీలో అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వేడుకున్నారు.  

• ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం సీతాపురం గ్రామానికి చెందిన మండవ అంజయ్య విజ్ఞప్తి చేస్తూ.. దొడ్డవరం గ్రామానికి చెందిన కావూరి అంకమ్మరావు తన వ్యవసాయ భూమిని ఆక్రమించుకుని బెదిరిస్తున్నాడని.. అడిగితే ఎస్సీ ఎస్టీ కేసు పెడతానంటున్నాడని.. తనకు న్యాయం చేయాలని వేడుకునాడు. 

• మార్టూరు మండలం మార్టూరు గ్రామం కిశోర్ కాలనీకి చెందిన బుడబుక్కల సంఘానికి చెందిన 30 కుటుంబాల వారు విజ్ఞప్తి చేస్తూ.. తమ కాలనీలో సైడ్ కాలువలు, రోడ్లు, వీధి లైట్లు వేయాలని కనీస మౌలిక వసతులు కల్పించాలని వేడుకున్నారు. 

• రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై తప్పుడు కుల దృవీకరణ పత్రంతో సర్పంచ్ గా అధికారం దక్కించుకున్న కరణం సత్తిబాబు OC అని అతని తప్పుడు కుల దృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలని కాళ్ల సర్వేశ్వరావు అర్జీ ఇచ్చారు. 

• అనకాపల్లి జిల్లా మండల కేంద్రమైన ఎస్ రాయవరం గ్రామ కాపురస్తులు పీర్ల పంజ మరియు నూర్ మజీద్ సభ్యులు షేక్ సత్తార్ తదితరులు విన్నవించుకొంటూ.. గ్రామ సచివాలయ మాజీ వాలంటీర్ షేక్ యాసిన్ రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రికార్డుల్లో పేర్లు మార్చి నిధులు స్వాహా చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. 

ఇంటి స్థలాలు, పింఛన్లు.. గోకులం షేడ్స్, ఆగిపోయిన ఇంక్రిమెంట్లు, ఫీజురియంబర్స్ మెంట్, వర్క్ బిల్లులు, భూమల రీసర్వేలు, అగ్రిగోల్డ్ బాధితులు, ఆర్థిక సాయం, సీఎంఆర్ఎఫ్ సాయం కోసం ఇలా పలువురు తమ సమస్యలపై నేతలను కలిసి వినతి పత్రాలు ఇచ్చి న్యాయం చేయాలని వేడుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here