గుంటూరు జిల్లా ysrcp లీగల్ సెల్ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు భగవాన్ సమన్వయం చేసినారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉన్నది.వైఎస్ఆర్సిపి నాయకులు క్యాడర్ హక్కుల కోసం కూటమి అన్యాయాలపై ధైర్యంగా వాదించి సత్యం న్యాయం పక్షాన నిలవాలి. వైఎస్ఆర్సిపి నాయకులపై,కేడర్ పై చట్టాలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని లెక్కచేయకుండా కేసులు పెడుతున్న వారిపై ప్రైవేట్ కేసులు వేయాలి.మహిళలపై రోజురోజుకు కూటమి పాలనలో అఘాయిత్యాలు దాడులు రేపులు హత్యలు పెరుగుతున్నాయి మహిళల రక్షణ కోసం వారి హక్కులను కాపాడడం కోసం వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ జగన్మోహన్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకొని అండగా నిలవాలి.ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా న్యాయవాదులు మరియు నగర అధ్యక్షురాలు నూర్ ఫాతిమా MLC లేళ్ల అప్పి రెడ్డి , MLC మురుగుడు హనుమంతరావు పార్లమెంట్ అబ్జర్వర్ పోతిన వెంకట మహేష్ ,మాజీ ఎమ్మెల్యే మరియు ఎంపీ వేణుగోపాల్ రెడ్డి , తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మరియు మాజీ ఎమ్మెల్యే శివకుమార్ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళి మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త వేమారెడ్డి తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు పత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Home Andhra Pradesh గుంటూరు జిల్లా ysrcp లీగల్ సెల్ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు మాజీ...