Home Political news గిరజన మైనింగ్ ప్రాంతాల్లో ఆరోగ్య ప్రదాయని ఆరోగ్య రథాలు

గిరజన మైనింగ్ ప్రాంతాల్లో ఆరోగ్య ప్రదాయని ఆరోగ్య రథాలు

4
0

గిరజన మైనింగ్ ప్రాంతాల్లో ఆరోగ్య ప్రదాయని ఆరోగ్య రథాలు

* కోటి రూపాయలతో రెండు ఆరోగ్య రథాల ప్రారంభం*

*కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద పేదలకు మెరుగైన వైద్యం*

*రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ ల మంత్రి కొల్లు రవీంద్ర*

మైనింగ్ అధికంగా జరిగే అరకు, పాడేరు ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలందించడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ ల మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ కార్యాలయం తాడిగడప లో ఆరోగ్య రథం వాహనాలను మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం  ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంధ్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఈ బస్సులు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. 2017 లో  ఎపిఎండీసీ ఆధ్వర్యంలో రూ. 17 కోట్లతో పలు అభివృద్ది పనులు చేపట్టామన్నారు. 

మైనింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సౌకర్యాలు అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా ఆరోగ్య రథాలను తీసుకువచ్చామన్నారు. ఇప్పటికే ఏపిఎండీసీ ద్వారా ఆరోగ్య సేవలు, విద్యాలయాలు, ఇతర వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఇప్పుడు కోటి రూపాయల వ్యయంతో పూర్తి సాంకేతికత కలిగిన రెండు వాహనాలను ప్రజల ముందుకు తీసుకొచ్చామన్నారు. వీటి ద్వారా ఆరోగ్య సేవలతో పాటు హెల్త్ చెకప్, కార్డియో, రక్త పరీక్షలు, ఈసీజీ తదితర సేవలు అందించటం జరుగుతుందన్నారు.  2019-24 మధ్య కాలం లో రాష్ట్రంలో కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ ను నాశనం చేసారన్నారు. రాష్ట్రంలోని ఖనిజ వనరులను దోచుకోవడంపై పెట్టిన శ్రద్ధ కనీసం ప్రజల ఆరోగ్యంపై పెట్టిన దాఖలాలు లేకుండా పోయాయన్నారు. భవిష్యత్తులో ఎక్కడ అవసరం ఉన్నా ఈ సేవలను కొనసాగిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. 

తొలుత ఏపీఎండీసీ ఎండీ ప్రవీణ్ కుమార్ తో కలిసి రెండు ఆరోగ్య రథం వాహనాలను జెండా ఊపి మంత్రి ప్రారంభించారు. అనంతరం బస్సులో కల్పించిన సదుపాయాలను పరిశీలించారు. అందుబాటులో ఉన్న వైద్య సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సేవ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని మరోసారి నిరూపించుకుంది. ఈ వాహనంలో ఒక డాక్టర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, డీఈవో, డ్రైవర్ మరియు ఫార్మసిస్ట్ ఉంటారు, వీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు నెలలో 24 రోజుల పాటు ఆయా గ్రామాల్లో ఆరోగ్య సేవలు ప్రజలకు అందిస్తారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here