గిన్నీస్ రికార్డ్స్ సాధించిన విశాఖ ‘యోగాంధ్ర’
యోగాంధ్ర విజయవంతం కావడంపై మంత్రి సవిత హర్షం
పీఎం నరేంద్రమోడీకి, సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు, మంత్రి నారా లోకేష్ కు మంత్రి సవిత ధన్యవాదాలు
విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద శనివారం ఉదయం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రివర్యులు ఎస్ సవిత
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన గిన్నీస్ రికార్డ్స్ సాధించిన యోగాంధ్ర కార్యక్రమంలో సహచర మంత్రులతో కలిసి యోగాసనాలు వేసిన మంత్రి సవిత
తెల్లవారుజామున 4 గంటలకే తనకు కేటాయించిన కంపార్ట్ మెంట్ కు చేరుకున్న మంత్రి సవిత…
గిన్నీస్ రికార్డ్స్ సాధించిన విశాఖ యోగాంధ్ర కార్యక్రమంలో పాలుపంచుకోవడంపై ఆనందం వ్యక్తం చేసిన మంత్రి సవిత
యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నడం తన పూర్వ జన్మ సుకృతమన్న మంత్రి సవిత
సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్య సాధనకు కృషి చేసిన వారందరికీ పేరు పేరునా మంత్రి సవిత ధన్యవాదాలు తెలియజేశారు.
తనకు కేటాయించిన ఎస్.కోట, విజయనగరం, గజపతినగరం, నెల్లిమర్ల, ఎచ్చెర్ల నియోజక వర్గ కూటమి నాయకులకు, అధికారులకు, నియోజకవర్గ వాసులకు కూడా మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు.
అభివృద్ధయినా, సంక్షేమమైనా, మీరే కార్యక్రమమైనా… దిగ్విజయం చేయడం సీఎం చంద్రబాబుకే సాధ్యమవుతుందని మరోసారి రుజువైందని మంత్రి సవిత తెలిపారు.
ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసిందని… ప్రపంచ పటంలో మన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక గుర్తింపు లభించింది : మంత్రి సవిత
విశాఖ యోగాంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన నరేంద్ర మోడీకి మంత్రి సవిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
యోగాంధ్ర నిర్వహణ కోసం రాష్ట్రం మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు, మంత్రి లోకేష్ కు మంత్రి సవిత ధన్యవాదాలు తెలియజేశారు…