Home Andhra Pradesh గిడుగు రుద్ర‌రాజుకు నూత‌న బాధ్య‌త‌లు అప్ప‌గింత‌ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంఘ‌ట‌న్‌ సృజ‌న్‌ అభియాన్...

గిడుగు రుద్ర‌రాజుకు నూత‌న బాధ్య‌త‌లు అప్ప‌గింత‌ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంఘ‌ట‌న్‌ సృజ‌న్‌ అభియాన్ పరిశీలకులుగా నియమించిన పార్టీ

3
0

గిడుగు రుద్ర‌రాజుకు నూత‌న బాధ్య‌త‌లు అప్ప‌గింత‌ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంఘ‌ట‌న్‌ సృజ‌న్‌ అభియాన్ పరిశీలకులుగా నియమించిన పార్టీ అధిష్టానంవిజ‌య‌వాడ‌:- మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పున‌ర్వైభ‌వం కోసం పార్టీని విస్త్ర‌తంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళేందుకు చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌లో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పూర్వ‌ పీసీసీ అధ్య‌క్షుడు, సీడ‌బ్ల్యూసీ మెంబ‌ర్ గిడుగు రుద్ర‌రాజును పార్టీ అధిష్టానం అద‌నంగా మ‌రో బాధ్య‌త‌ను అప్ప‌గిస్తూ కీల‌క ప‌ద‌విలో నియ‌మించింది. ఈ మేర‌కు మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియమాకానికై ఏఐసీసీ ఏర్పాటు చేసిన “సంఘ‌ట‌న్‌_సృజ‌న్‌_ అభియాన్” పేరుతో పార్టీ చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి విస్త్ర‌తంగా తీసుకెళ్ళేందుకు త‌న‌ను పరిశీలకులుగా నియ‌మించిన‌ట్లు పార్టీ అధిష్టానం నుంచి సోమ‌వారం స‌మాచారం అందిన‌ట్లు రుద్ర‌రాజు తెలిపారు. ఈ సంద‌ర్భంగా గిడుగు రుద్ర‌రాజు మాట్లాడుతూ, త‌న‌కు అప్ప‌గించిన ఈ బాధ్య‌త‌ల‌ను చిత్త‌శుద్ధితో నిర్వ‌హించి మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేసేందుకు కృషి చేస్తాన‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా పార్టీ అధ్య‌క్షులు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే, పార్టీ యువ నాయ‌కుడు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌కు రుద్ర‌రాజు ధ‌న్య‌వాదాలు తెలిపారు. నూత‌న బాధ్య‌త‌లు చేప‌ట్టిన గిడుగు రుద్ర‌రాజుకు ఎపిసిసి డేలిగేట్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు ఉపాధ్యక్షుడు అడ్మిన్, ఆర్గనైజేషన్ కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ త‌ర‌పున కోకా ఫణిభూషణ్, ప‌లువురు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అభినంద‌న‌లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here