Home Political news గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ నాయకులు

గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ నాయకులు

3
0

విజయవాడ

గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ నాయకులు

 

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు  దగ్గుబాటి పురందేశ్వరి కామెంట్స్
గతంలో నేను రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనగా ఉందని నా దగ్గర ఉన్న సమాచారాన్ని అవగాహనతో ప్రజల ముందు ఉంచటం జరిగింది
రాష్ట్ర ప్రభుత్వం RBI మరియు ఇతర FRBI నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం ఆస్తులను తనఖా పెట్టి వివిధ సంస్థల నుండి అప్పులు చేయడం జరిగింది 
ఈ అప్పులు తేవడం ఎక్కడి వరకు వెళ్లిందంటే, కార్పొరేషన్లను సృష్టించి అవి ప్రభుత్వ అప్పులు కాదని కార్పొరేషన్ పేరు మీద రుణాలు సేకరించి వాటిని డైవర్ట్ చేస్తూ వచ్చింది. 
 ప్రజల త్రాగే మద్యం కార్పొరేషన్ ద్వారా ఆదాయం చూపించి రాబోయే కాలంలో ప్రజలు వినియోగించే మద్యాన్ని కూడా చూపించి అప్పులు చేయడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిఎఫ్ ఇతర ఫండ్స్ ను కూడా తీసుకోవడం జరిగింది. 
 రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిన బకాయిలు ఇవ్వనందు వలన వారు ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
 పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించింది. 
తెచ్చిన అప్పులకు వడ్డీలు, అసలు తడిపి మోపడై చివరకు ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేనటువంటి పరిస్థితికి చేరుకుంది .
 సార్వత్రిక ఎన్నికల తరువాత అంతకుముందు కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిన మొత్తాలను CMFS లకు అప్లోడ్ చేస్తూ వాటిని క్రమంలో చెల్లించకుండా ఇష్టమైన రీతిలో ఇష్టమైన వాళ్లకు మాత్రమే పేమెంట్ చేస్తూ ఉండటం అందరి దృష్టికి వచ్చింది. 
ఆపధర్మ ప్రభుత్వంగా ఉన్న
ప్రభుత్వం ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా
చెల్లింపులు చేయడం సమంజసం కాదు.
*ఈ క్రింది వివరాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా గవర్నర్ తెప్పించి మాకు అవగాహన కల్పించాలని గవర్నర్ ని కలిసాం*
మొత్తం అవుట్ స్టాండింగ్ RBI లిస్టు ప్రకారం తెచ్చిన అప్పులు.
 కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పుల మొత్తం (కార్పొరేషన్ల వారీగా)
 కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బకాయిలు మొత్తం.
రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు మొత్తం
 రాష్ట్ర ప్రభుత్వం సావనీర్ గ్యారెంటీ ఇచ్చి తెచ్చిన అప్పులు మొత్తం
ఎన్నికల అనంతరం కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్స్ వివరాలు
 ప్రభుత్వ ఉద్యోగులు ఇతర ప్రావిడెంట్ ఫండ్స్ నుండి మరియు ఆర్థిక సంస్థల నుండి తెచ్చిన అప్పుల వివరాలు
 ప్రభుత్వ ఉద్యోగులకు TA,DA బకాయిలు ఎంత ఉన్నవి
ప్రతి సంవత్సరం రీపేమెంట్ కు అసలు ప్లస్ వడ్డీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఎంత కట్టవలసి ఉంది 
 సివిల్ సప్లయర్స్ కార్పొరేషన్కు, డిస్కం లకు, పవర్ సప్లయర్స్ లకు చెల్లించవలసిన బకాయిలు ఎంత ఉన్నవి .
ఈ సంవత్సరంలో వివిధ సంక్షేమ పథకాలకు
నిధులు రిలీజ్ చేయవలసి ఉన్నప్పటికీ, అతికొద్ది మాత్రమే ఇచ్చి మొత్తం రిలీజ్ చేసినట్లుగా ప్రకటనలు చేస్తున్నారు 
బట్టన్ నొక్కిన వారికి కూడా పాక్షికంగా చెల్లించిన విధానం 
 ఈ విధంగా ఈ సంవత్సరం సంక్షేమ పథకాలకు ఎంత నిధులు చెల్లించవలసి ఉన్నది.
రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్ని కేసులు ఉన్నవి .
కోర్టులు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం అమలుపరచకుండా కంటెంప్ట్ కేసులు ఎన్ని ఉన్నవి…
 గవర్నర్  ని కలసి న వారి లో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రాశివన్నారాయణ, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, బిజెపి మీడియా రాష్ట్ర ఇంఛార్జి పాతూరి నాగభూషణం, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, రాష్ట్ర అధికార ప్రతినిధి లు యామినీ శర్మ, ఆర్ డి విల్సన్ 
బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం, బిజెపి సీనియర్ నేత కిలారు దిలీప్ , జగదీష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here