Home Political news గన్నవరం క్యాంప్ కార్యాల‌యంలో ఘ‌నంగా 75వ రాజ్యాంగ ఆమోద దినోత్స‌వ వేడుక‌లు

గన్నవరం క్యాంప్ కార్యాల‌యంలో ఘ‌నంగా 75వ రాజ్యాంగ ఆమోద దినోత్స‌వ వేడుక‌లు

3
0

 *26.11.2024*

గన్నవరం క్యాంప్ కార్యాల‌యంలో ఘ‌నంగా 75వ రాజ్యాంగ ఆమోద దినోత్స‌వ వేడుక‌లు

*ప్రజా సమస్యల పరిష్కారానికే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం*

*గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు*

గన్నవరం  :  భార‌త రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా గన్నవరం క్యాంప్ కార్యాలయం నందు భార‌త రాజ్యాంగ 75వ ఆమోద దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా గన్నవరం ఎమ్మెల్యే , ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు డా.బి..ఆర్ అంబేద్క‌ర్ చిత్ర ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.  భారత రాజ్యంగాన్ని అందరికీ ఆమోద యోగ్యంగా రూపొందించి ప్రపంచ వ్యాప్తంగా దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకు వచ్చిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ సేవలను ఎమ్మెల్యే కొనియాడారు.

అనంతరం గన్నవరం క్యాంప్ కార్యాలయం నందు ప్రజల నుండి వినతులు స్వీకరించారు . కొన్ని సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కారం చూపించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజా సమస్యల పరిష్కారానికే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు.   ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ పరమావధి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారం లో రెండు రోజులు గన్నవరం క్యాంప్ కార్యాలయం నందు , రెండు రోజులు విజయవాడ కార్యాలయం నందు అందుబాటులో ఉంటానని వారం లో 7 రోజులు తన వ్యక్తిగత సిబ్బంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం అందుబాటులో ఉంటారని ఆయన అన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here