Home Andhra Pradesh గన్నవరంలో కూటమి ప్రభుత్వానికి ఏడాది..టిడిపి నేతల సంబరాలు

గన్నవరంలో కూటమి ప్రభుత్వానికి ఏడాది..టిడిపి నేతల సంబరాలు

3
0

గన్నవరంలో కూటమి ప్రభుత్వానికి ఏడాది..టిడిపి నేతల సంబరాలు

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు

విధ్వంసం నుండి వికాసం వైపు పరుగులు పెడుతున్న గన్నవరం నియోజకవర్గం

గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ

ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు

కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా విజయవాడ రూరల్ మండల టీడీపీ కార్యాలయంలో భారీ జన సమూహం మధ్య ఈరోజు సంబరాలు నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి స్వర్ణయుగానికి ఏడాది ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో “సుపరిపాలనకు ఏడాది” అనే కార్యక్రమం చేపట్టి విజయవాడ రూరల్ మండలం, నిడమానూరు సెంటర్ నుండి విజయవాడ రూరల్ మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్వయంగా బైక్ పై ప్రయాణిస్తూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. బాణాసంచా కాలుస్తూ కూటమి పార్టీల కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, అనంతపురం అర్బన్ నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర విజన్ 2047 గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కల అని, శక్తివంతమైన, సమగ్రమైన, అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్‌ ను నిర్మించేందుకు రూపొందించిన ప్రణాళిక అని స్పష్టం చేశారు. ఈ దిశగా గన్నవరం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ఉత్తమ మౌలిక వసతులు కల్పించడం, నిజమైన మార్పును తీసుకురావడం పై దృష్టి పెట్టామని తెలిపారు.

గన్నవరం నియోజకవర్గంలో మరో రెండు ఎస్ ఈ జెడ్ లను నెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధితోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని అన్నారు. అవకాశాలను అభివృద్ధిగా మలిచేందుకు స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.

చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో, ప్రతి ఒక్కరి కృషి తో గన్నవరాన్ని సమగ్ర అభివృద్ధిలో ఆదర్శమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దగలమన్న నమ్మకం ఉందని తెలిపారు.

గత వైసిపి ప్రభుత్వంలో కనీసం తట్ట మట్టి వేసిన దాఖలాలు లేవని నియోజకవర్గంలోని రహదారులన్నీ గుంతలమయం చేశారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన రహదారులకు మరమత్తు పనులు చేపట్టి గుంతలు లేని రహదారులను తయారు చేశామని అన్నారు. రూ 3 వేలు గా ఉన్న సామాజిక పింఛన్లను ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి రూ 4 వేలు చేశామని, ప్రతి నెల ఒకటవ తేదీనే లబ్ధిదారులకు వారి ఇంటి వద్ద అందజేస్తున్నామని అన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో భాగస్వాములైన ప్రజలకు ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు బిజెపి గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జ్ ఫణి కుమార్ తదితరులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో గత ఏడాదిగా అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గురించి కార్యకర్తలకు వివరించారు. ఈ సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి “తల్లికి వందనం” ద్వారా రూ.15 వేలు అందజేసే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు కి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో చలమల శెట్టి రమేష్ బాబు, ఫణి కుమార్, గొడ్డల్ల చిన్న రామారావు, కోనేరు సందీప్, దొంతు చిన్నా, గూడవల్లి నరసింహారావు, కోనేరు పెద్దబాబు, దయాల రాజేశ్వరరావు, ఆరుమళ్ళ వెంకటకృష్ణారెడ్డి, బండి వెంకట్రావు (నాని), మూల్పూరి సాయి కళ్యాణి, పొదిలి లలిత, మేడేపల్లి రమ, నెక్కంటి శ్రీదేవి, బొమ్మసాని అరుణకుమారి, కానూరు యుగంధర్, నబిగాని కొండయ్య, దాసరి మహేష్, కొసరాజు సాయి, మొవ్వ వెంకటేశ్వరరావు, గంపా శ్రీనివాస్, అద్దేపల్లి సాంబశివ నాగరాజు, కొల్ల ఆనంద్, పట్టపు చంటి, కొమ్మారెడ్డి రాజేష్, కొలుసు రవీంద్రబాబు, నున్న రామకృష్ణ, అడుసుమిల్లి నవీన్, తంగిరాల శ్రీనివాసరావు, చలసాని శ్రీనివాసరావు, కొల్లూరు చంద్రకాంత్, మొవ్వ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here