Home Political news గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలం అయింది

గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలం అయింది

3
0

 గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలం అయింది

ఈ ఏప్రియల్ నుంచి మున్సిపాల్టీల నిధులు ఆయా మున్సిపాల్టీల అభివృద్దికి మాత్ర‌మే ఖ‌ర్చు

అమ‌రావ‌తిపై అవాస్తవాల‌తో ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు

అమ‌రావ‌తి నిర్మాణం కోసం ప్ర‌జ‌ల‌పై ఒక్క రూపాయి కూడా భారం వేసేది లేదు

ఇంజినీర్ల క‌మిటీ నిర్ణ‌యం మేర‌కే టెండ‌ర్ ధ‌ర‌ల నిర్ధార‌ణ‌

ఎన్నిక‌ల కోడ్ తో అమ‌రావ‌తి ప‌నులు ఆల‌స్యం

వ‌చ్చే నెల 10 త‌ర్వాత అమ‌రావ‌తి నిర్మాణ ప‌నులు ప్రారంభం

పొంగూరు నారాయణ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ శాఖామాత్యులు 

ఫైనాన్షియల్ డిసిప్లేన్ లేక, గత ప్రభుత్వానికి ప్లానింగ్ లేకపోవడంతో రాష్ట్రం ఎంతలా అతలాకుతలం అవుతుంతో ప్రత్యక్ష ఉదాహరణ గత ప్రభుత్వ పాలన అని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ శాఖామాత్యులు పొంగూరు నారాయణ అన్నారు. బడ్జెట్ లో మున్సిపల్ శాఖకు, సీఆర్డీఏ కు అధిక నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం పబ్లిసిటీ సెల్ లో మంత్రి నారాయణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వానికి పాలన చేతకాకపోవడంతో కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘ నిధులు సైతం డైవర్ట్ చేశాడని దీంతో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందన్నారు. ఇక మున్సిపల్ శాఖ విషయానికి వస్తే ప్రజలు మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు ప్రజలు చెల్లించే పన్నులు చట్టం ప్రకారం స్వపరిపాలనలో భాగంగా ఆ ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేయవచ్చు. అంటే డ్రైయిన్లు శుభ్రం చేసుకోవడం, తాగునీటి అవసరాలకు వినియోగించుకోవడం, స్వచ్చతా తదితర ప్రజాపయోకర కార్యక్రమాలకు కౌన్సిల్ ఆమోదంతో ఖర్చు చేసుకోవచ్చు. అయితే గత ప్రభుత్వం స్వపరిపాలనకు చరమగీతం పాడుతూ సీఎఫ్ఎంఎస్ కు మళ్లించడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో కనీసం బ్లీచింగ్ కొనటానికి కూడా నిధులు లేక అల్లాడిపోయే పరిస్థితి నెలకొందని ఆవేధన వ్యక్తం చేశారు. అలా అన్ని డిపార్ట్ మెంట్ లను ఆర్థికంగా సర్వనాశనం చేశారు. కూటమి అధికారంలోకి రాగానే అపార అనుభవం ఉన్న ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయుడు ఒక్కోక్క సమస్యను పరిష్కరించుకుంటూ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారన్నారు. అందులో భాగంగా ఈ ఏడాది ఏప్రియల్ ఒకటి నుంచి ఏ మున్సిపాల్టీలో ప్రజలు చెల్లించే పన్నులు ఆ మున్సిపాల్టీ నే ఖర్చు చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది. అందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంత్రి నారాయణ ధన్యవాదాలు తెలిపారు.*

         మున్సిపల్ శాఖకు బడ్జెట్ లో పెద్దపీట వేస్తూ రూ. 13,862 కోట్లు కేటాయించడం పై మంత్రి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. అందులో రూ. 6వేల కోట్లు సీఆర్డీఏకు కేటాయించడం జరిగిందన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా ఒక్కో హామీని నెరవేరుస్తూ వస్తున్నామన్నారు. సూపర్ సిక్స్ లో పేర్కోన్న ఎన్టీయార్ భరోసా పెన్షన్లు, దీపం పథకం-2 ఇప్పటికే అమలు చేస్తున్నామన్నారు. ఎన్టీయార్ భరోసా ఫించన్లకు రూ. 27,518 కోట్లు, అలాగే దీపం 2 పథకం నిర్వహిణకు రూ. 2,600 కోట్లు నిధులు కేటాయించటం జరిగిందన్నారు. తల్లికి వందనం పథకంలో భాగంగా ఆ ఇంట్లో ఎంత మంది చదువుకునే చిన్నారులన్నా వారికి ఒక్కోక్కరికి రూ. 15వేలు ఇస్తామన్న హామీలో భాగంగా రూ. 9,407 కోట్లు బడ్జెట్ లో కేటాయింపులు చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది మే లోపు అర్హులందరికి తల్లుల ఎకౌంట్లలో జమ చేయడం జరుగుతుందన్నారు. రైతన్నల సంక్షేమాన్ని కాంక్షించే ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయడు అన్నదాత సుఖీభవ పథకం కు బడ్జెట్ లో రూ. 6300 కోట్లు కేటాయించారని మంత్రి నారాయణ తెలిపారు. 

                   ఇక ఎస్సీల సంక్షేమానికి రూ. 20,280 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ. 8,159 కోట్లు, బీసీ ల సంక్షేమానికి రూ. 47,456 కోట్లు, అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతి కోసం రూ. 5,434 కోట్లు బడ్జెట్ కేటాయించి పేదల పక్షపాతి ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయుడు అని మరోసారి నిరూపించుకున్నారన్నారు. అదే గత ప్రభుత్వ పాలకులు కేవలం మాటలు చెప్పి ఆర్థికంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదాహరణకు కేంద్రం అమృత్ పథకంలో భాగంగా రూ. 8,500 కోట్లు మున్సిపల్ శాఖ ద్వారా ఖర్చే చేయలేకపోయాడు. ఎందుకంటే గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇవ్వకపోవడమే కారణమన్నారు. మ్యాచింగ్ ఫండ్ 30 శాతం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఎన్నో నిధులు వినియోగించుకోలేకపోయిన పరిస్థితి నెలకొందన్నారు. 

                          ఒక పత్రిక అబద్ధపు రాతలను రాస్తూ, అవే నిజాలని ప్రజలను నమ్మించాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణానికి చ‌ద‌ర‌పు అడుగుకు 4382 రూపాయిలు ఖ‌ర్చ‌వుతుంద‌ని..కానీ జ‌గ‌న్ ప‌త్రిక‌లో మాత్రం చ‌ద‌ర‌పు అడుగుకు 9300 రూపాయిలు ఖ‌ర్చ‌వుతుంద‌ని దుష్ఫ్ర‌చారం చేస్తున్నార‌ని అన్నారు ఇత‌ర అద‌న‌పు వ‌స‌తులు,జీఎస్టీతో పాటు ఇత‌ర ప‌న్నులు క‌లుపుకునిమొత్తం 516 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌న్నారు.ఇక మంత్రులు,జడ్జీల బంగళాల నిర్మాణానికి చ‌ద‌ర‌పు అడుగుకు రూ.10,042 ఖర్చు అవుతుందని రాశారు. కాని వాస్తవంగా స్వేర్ ఫీట్ కు రూ. 4,264 మాత్రమే ఖ‌ర్చ‌వుతుందని మరీ ఇంత ఘోరంగా రాస్తున్నారన్నారు. అలాగే ఇతర సదుపాయాలకు రూ. 401 కోట్లు మరియు పన్నులు కలుపుకుంటే రూ. 492 కోట్లు మాత్రమే అని వివరించారు.నిర్మాణంలో నాణ్యతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఇంజినీర్ల క‌మిటీ నిర్ధారించిన ధ‌ర‌ల మేర‌కే టెండ‌ర్లు పిలిచాం త‌ప్ప‌…ఏ కాంట్రాక్ట‌ర్ కి క‌ట్ట‌బెట్టేందుకు చేయ‌లేద‌న్నారు.

                   ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉండ‌టంతో అమ‌రావ‌తి టెండ‌ర్ల ప్ర‌క్రియ ఆల‌స్యం అయింద‌న్నారు మంత్రి నారాయ‌ణ‌..మార్చి ప‌దో తేదీన టెండ‌ర్లు ఖ‌రారు చేసి ఆ త‌ర్వాత ప‌నులు ప్రారంభిస్తామ‌న్నారు..ప్ర‌ణాళికాబ‌ద్దంగా అమ‌రావ‌తి నిర్మాణ ప‌నులు చేస్తామ‌న్నారు..మూడేళ్ల‌లో అమ‌రావ‌తి నిర్మాణం పూర్తిచేయాల‌ని సీఎం చంద్ర‌బాబు ఆదేశించిన‌ట్లు మంత్రి తెలిపారు..అమ‌రావ‌తి సీడ్ కేపిట‌ల్ నుంచి 16 వ నెంబ‌ర్ జాతీయ ర‌హ‌దారికి క‌లిపే రోడ్ల నిర్మాణ ప‌నులు త్వ‌ర‌లో ప్రారంభ‌మ‌వుతాయ‌న్నారు…వీటి త‌ర్వాత‌ మ‌ధ్య‌లో నిర్మాణం నిలిచిపోయిన సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణం కూడా ప్రారంభించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు మంత్రి నారాయ‌ణ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here