గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం
కానూరులో సిద్ధార్థ ఫ్లై ఓవర్ను ప్రారంభోత్సవంలో మంత్రి నారాయణ
ఫ్లై ఓవర్ నుంచి జాతీయ రహదారికి వెళ్ళే 3.5 కి.మీ రోడ్డును సీఆర్దియే నిధులతో నిర్మిస్తామని హామీ
విజయవాడ, సెల్ఐటి న్యూస్:- విజయవాడ సమీపంలోని కానూరులోని విఆర్ సిద్ధార్థ కళాశాల వద్ద నూతనంగా నిర్మించిన సిద్ధార్థ ఫ్లైఓవర్ను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ.. పెనమలూరు, కైకలూరు, విజయవా పశ్చిమ నియోజకవర్గాల శాసనసభ్యులు బోడే ప్రసాద్, కామినేని శ్రీనివాస్లతో కలిసి సోమవారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఐదున్నరెళ్ళుగా ప్రారంభానికి ఫ్లై ఓవర్ నోచుకోలేదన్నారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విజ్ఞప్తి మేరకు ఫ్లై ఓవర్ నుంచి జాతీయ రహదారికి వెళ్ళే 3.5 కి.మీ రోడ్డును సీఆర్దియే నిధులతో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సిద్ధార్థ ఫ్లై ఓవర్ ను నా చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ఖజానాలో పైసా లేదు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. మున్సిపాలిటీల్లో ప్రజలు కట్టిన పన్నుల నిధులను పక్కదారి పట్టించారు. మున్సిపల్ శాఖలో రూ.3200 కోట్ల నిధులను పూర్తిగా వాడేశారు. సీఎం చంద్రబాబుకు ఉన్న అనుభవంతో ఆర్థిక పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఫిబ్రవరిలో ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ కేటాయించిన రూ.5300 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల చేయలేదు. 2020లో కేంద్రం అమృత్ పథకం నిధులు మొదటి విడత విడుదల చేసినా కేంద్రం రాష్ట్ర వాటా ఇవ్వలేదు. స్వచ్ఛ భారత్ ద్వారా కేంద్రం ఇచ్చే నిధులకు కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు. కేంద్ర నిధులు విడుదలై ఉంటే అన్ని మున్సిపాలిటీల్లో డ్రైనేజీ, తాగునీటి సమస్య పరిష్కారం అయ్యేది. తాడిగడప మున్సిపాలిటీలో డ్రెయిన్లు పరిస్థితి దారుణంగా ఉంది. ఖచ్చితంగా అన్ని డ్రెయిన్లు మెరుగు చేసి మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తాం అన్నారు. కార్యక్రమంలో సిద్దార్ధ అకాడమి కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.*