గడచిన 5 యేళ్ళ కాలంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనుడు వైయస్ జగన్ – MLA నల్లమిల్లి
పాత్రికేయులతో సమావేశంలో MLA నల్లమిల్లి మాట్లాడుతూ
*విద్యుత్ చార్జీలు పెంపు మీద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయమని జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వడం అంటే తాను పిచ్చి తుగ్లక్ కి ఏమాత్రం తీసిపోను అని నిరూపించుకోవడం లాంటిదే*
*తాను పెంచిన విద్యుత్ ఛార్జిల మీద తన నాయకుల చేతనే ధర్నా చేయించుకోవడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి*
*బహుశా స్థానిక నాయకులకు కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది అవగాహన లేదు. చార్జీలు ఏ విధంగా పెంచబడ్డాయి, ట్రూ అప్ చార్జెస్ అంటే ఏంటి? ఈ ఆర్ సి ఏ విధంగా డైరెక్షన్స్ 2021 నుండి 2024 వరకు ఇచ్చింది అనేది వారికి అవగాహన లేదు. ఈ ఆర్ సి ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు అమలు అవుతున్నాయి. ఈ పాపం వైసిపిదే. జగన్మోహన్ రెడ్డి దే*
*ఇవేమి తెలియక దున్న పోతు ఈనింది అంటే దూడ ని కట్టండి అన్నట్లు గా వైసిపి నాయకులు ముందుకు వెళుతున్నారు*
*ఈ ఆర్ సి ఆదేశాలు 20021-2024 కి ఏ విధంగా ఉన్నాయి అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.*
*20021-22 కి AP ఈ ఆర్ సి ట్రూ అప్ చార్జీలు అప్రూవ్ చేసింది 3082 కోట్లు, 2022-23 కి 6073 కోట్లు, 2023-24 కి 11000 కోట్లు.. మొత్తం దాదాపు ఇరవై వేల కోట్లు ట్రూ అప్ చార్జెస్ అదనపు భారం ప్రజల పై వేశారు*
*జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు నాడు A P ఈ ఆర్ సి ఆదేశాలు ఇచ్చింది*
*ఆనాడు AP ఈ ఆర్ సి ఈ ఆదేశాలు 2024 డిసెంబర్ నుండి అమలు కావాలి అని చెప్పింది. ఇది ఎవరి పాపం అనేది ధర్నా చేస్తున్న నాయకులు సమాధానం చెప్పాలి*
*2014 లో లోటు విద్యుత్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడితే 2019 నాటికి మిగులు విద్యుత్ స్టేట్ గా ఏపీ ని చంద్రబాబు తీర్చిదిద్దారు*
*దాన్ని 10,000 లోటు కి జగన్ తీసుకువెళ్లారు*
*జెన్ కో & ట్రాన్స్ కో లను సర్వనాశనం చేసిన ఘనత జగన్ దే*
*యూనిట్ రూ 5 కి జెన్ కో ని విద్యుత్ లభిస్తుంటే కమీషన్ల కోసం 8 రూ కి పొరుగు రాష్ట్రాల నుండి విద్యుత్ కొనుగోలు చేసింది జగన్ ప్రభుత్వం*
*ప్రజలపై భారం పెంచడానికి ఇన్ని తప్పులు చేసిన జగన్ మోహనరెడ్డిదా ఈపాపం? లేక కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వందా చెప్పాలి?*
*ఎన్నికలలో ప్రజా వ్యతిరేకతకు భయపడి ఈ ఆర్ సి ఆదేశాలను ఈ ఆర్ సి చేతనే డిసెంబరు 2024 నుండి అమలు చేయాలని చెప్పించిన ఘనుడు వైయస్ జగన్*
*తన ఐదేళ్ళ పాలనలో 9 సార్లు ఛార్జీలు పెంచి నేడు ధర్నాలు చేయించడం అంటే పిచ్చి తుగ్లక్ చర్యగా భావించాలి*
*ఇక్కడ రైతులు గురించి మాట్లాడుతున్న తింగరి గంగిరెడ్డి కి గత ఐదేళ్ళూ ప్రేమ ఏమైపోయిందని ప్రశ్నిస్తున్నా*
*మొన్న రైతు వ్యతిరేక విధానాలను కూటమి ప్రభుత్వం అవలంభిస్తుందని ఆయన చేసిన హడావిడికి రైతుల నుండి స్పందన కరువైతే సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నామని తోక ముడిచారు*
*గత ఐదేళ్ళలో ధాన్యం కొనుగోలులో మీరు దిగమింగిన సొమ్మెంత? మీ తోడల్లుడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉంటూ బస్తాకి 300-400 తక్కువకి కొంటుంటే మీరేం చేసారు?*
*ఎవరైనా బస్తాకు రూ 50 కి ఎక్కువకు కొంటుంటే నియంత్రించిన మీ తోడల్లుడిని ఏం చేసారు అందులో మీకు ముట్టింది ఎంత? ధాన్యం సొమ్ములు ఆరేసి నెలలకు గానీ రాకపోయినా మీరెపుడైనా నోరు మెదిపారా?*
సింగంపల్లి ఈలకొలను షిప్ట్ ఆపరేటర్ పోస్టులను అమ్ముకోవడం వాస్తవం కాదా?*
*గడచిన ఐదేళ్ళలో ఇక్కడ విద్యుత్ రంగం మౌళిక వసతుల కోసం మీరు చేసింది ఏంటి?
*జమిలీ ఎన్నికలంటే ఏంటి? అసెంబ్లీ ఎన్నికలంటే ఏంటి? పార్లమెంటు ఎన్నికలు అంటే ఏంటో మీకు అవగాహనే లేదు. జమిలీ 2029 లో జరుగుతుంది అప్పుడు కూడా కూటమి ప్రభుత్వమే అధికారం దక్కించుకుంటుంది*