భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా నుంచి హెచ్చరిక
ఖలీఫ్ తుల్లా భాషా కు బిజెపి కి సంబంధం లేదు
బిజెపి కి జనతా మజ్దూర్ సెల్ అనే అనుబంధ సంఘం లేదు
అమరావతి…ఇటీవల ఒంగోలు ప్రాంతానికి చెందిన షేక్ ఖలిఫతుల్లా భాష అనే వ్యక్తి గతంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పటికీ ఆయన మీద ఉన్న అనేక ఫిర్యాదుల నేపథ్యంలో వారిని భారతీయ జనతా పార్టీ నుంచి పక్కన పెట్టడం జరిగింది ఇటువంటి బాధ్యతలు లేకుండా వారిని ఉంచడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఆయన హ్యూమన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని అదేవిధంగా ఏ9 యూట్యూబ్ ఛానల్ అని అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీలో చేరటం , ఎన్ డి ఏ జేఏసీ అనేటువంటిది ఏర్పాటు చేసి దాంతో ముస్లింల యూనిటీ అని అదే విధంగా భారతీయ జనతా మజ్దూర్ సెల్ అని కొత్త ప్లాట్ఫామ్ తో భారతీయ జనతా పార్టీకి అనుబంధం అని చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు మద్దతు ఇస్తామని వీడియో చేయటం ,ఇటువంటి ప్రక్రియలు జరిమిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి యొక్క చూసిన మేరకు బిజెపి మైనార్టీ మోర్చా పత్రిక సమావేశం నిర్వహించి ఇటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రంలోని అన్ని జిల్లా అధ్యక్షులు కూడా స్పందించవద్దని అదేవిధంగా మైనారిటీ మోర్చ సంబంధించినటువంటి బాధ్యతలోనటువంటివారు ఎవరు కూడా ఇటువంటి వ్యక్తుల పట్ల ,పదవుల పట్ల అదేవిధంగా వారిస్తున్నటువంటి బాధ్యతల పట్ల నమ్మి మోసపోవద్దు అని హెచ్చరించడమైనది. భారతీయ జనతా పార్టీని అభాష్పాలు చేయాలని కార్యకర్తల్లో అయోమయాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్న వీరి మీద బిజెపికి ఫిర్యాదు చేస్తూ రాష్ట్ర పార్టీ క్రమశిక్షణ సంఘాన్ని కూడా తెలియజేయడం జరిగింది.
ఈ సమావేశంలో బిజెపి మైనారిటీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ అబ్దుల్ ఖుద్దుస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ భాష,, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ షేక్ రఫీ, ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ నాయకులు డి హుస్సేన్ మరియు షేక్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు