15-10-2024
ధి:15-10-2024 మంగళవారం ఉదయం 10:00″గం లకు” సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని సింగినగర్ మాకినేని బసవ పున్నయ్య స్టేడియం నందు వీరమాచనేని వజ్ర శేఖర్ రావు జ్ఞాపకార్ధం భాను నగర్ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ను సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వర రావు క్రికెట్ టోర్నమెంట్ టాస్ వేసి ప్రారంభించడం జరిగినది
ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ:-నవ్యాంధ్రలో క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తూ NDA కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా క్రికెట్ టోర్నమెంట్ ని నేడు ప్రారంభించాము అని, క్రీడాకారులను అన్ని విధాలా ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబబునాయుడు , సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులి గా తాను అన్ని విధాల పేర్లను ప్రోత్సహించి క్రీడాకారులకు అన్ని విధాల అండగా ఉంటానని…
తక్షణం ఈ సింగినగర్ బసవపునయ్య స్టేడియాన్ని ప్రజలకు వాకింగ్ చేసుకోవడానికి, అలాగే యువత క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించుకునే విధంగా తీర్చి దిద్దుతామని ఈ సందర్భంగా యువతకు బొండా ఉమా మాటిచ్చి , క్రీడాకారులకు ఎటువంటి అవసరం వచ్చిన తాను సహాయం చేయడానికి తాను ముందు ఉంటానని తెలియజేయడం జరిగినది.