09-11-2024
కొమ్మారెడ్డి , గొట్టుముక్కలకు శుభాకంక్షలు తెలిపిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ ఛైర్మన్ గా కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ గా నియమితులైన వీరికి ఎంపి కేశినేని శివనాథ్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవులు ప్రకటించిన తర్వాత టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, గొట్టుముక్కల రఘురామరాజు గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ వారికి అభినందనలు తెలపటంతో పాటు పూలమొక్కలు బహుకరించారు.గత ప్రభుత్వంలో పట్టాభిరామ్ ను ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా వెనకడుగు వేయకుండా నిరంతరం ప్రజాక్షేత్రంలో వుండి పోరాడుతూ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎన్డీయే కూటమి గెలిచేందుకు కష్టపడ్డారని ఆయన సేవలు కొనియాడారు. అలాగే టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు జగన్ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేయటమే కాకుండా ఎన్డీయే కూటమి గెలుపుకి ఎంతో కృషి చేశాడన్నారు.
ఈ కార్యక్రమంలో టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పర్చూరి ప్రసాద్, టి.ఎన్.ఎస్.ఎఫ్. జిల్లా ప్రధాన కార్యదర్శి పి.చరణ్ సాయి యాదవ్, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, టిడిపి రాష్ట్ర నాయకులు కాకి మల్లిఖార్జున యాదవ్ , ఎస్.ఎల్.వి గ్రాండ్ అధినేత శ్రీనివాస రాజు తదితరులు పాల్గొన్నారు.