కొత్తూరు తాడేపల్లి ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు
ఎన్నికల ప్రచారం లో భాగంగా సోమవారం రాత్రి గ్రామస్తులు అపూర్వమైన ఆదరణ చూపి అత్మీయ స్వాగతం పలికారు. మహిళలు మంగళ హరతులతో అశీర్వదించారు
ఈ సందర్బంగా ప్రచార రధం పై నుండి ప్రజలనుద్దేశించి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు మాట్లాడుతూ
ప్రజా వ్యతిరేక పరిపాలన సాగించిన జగన్మోహనరెడ్డి కి ప్రజలు తగిన బుద్ది చెప్పాలని విజ్ణప్తి చేశారు
చంద్రబాబు పాలన చారిత్రక అవసరమని ప్రజలంతా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపాలని కోరారు
ఈ నెల 13 న జరుగునున్న సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తులపై ఓట్ల వేసి మరోసారి ఎమ్మెల్యే గా అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ణప్తి చేశారు
ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు అక్కల రామ్మోహన్ (గాంధీ) గారు, తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు