విజయవాడ నగరపాలక సంస్థ
13-06-2025
కొండపైన అనధికార కట్టడాలను నిర్మూలించండి
ప్రజల క్షేమమే ప్రధాన లక్ష్యం- విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
ప్రజల క్షేమమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని, కొండపైన ఉన్న అనధికార కట్టడాలను నిర్మూలించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా వన్ టౌన్, పంజా సెంటర్, చిట్టినగర్, కేఎల్ రావు పార్క్, సివిఆర్ ఫ్లై ఓవర్, పైపుల్ రోడ్, అజిత్ సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కొండపైన అనధికార కట్టడాలను నిర్మూలించాలని, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజల ప్రాణాలకు ఎటువంటి భంగం కలగకుండా ఉండేందుకు విజయవాడ నగర పాలక సంస్థ తీసుకుంటున్న చర్యలు తూచా తప్పకుండా అందరూ పాటించాలని అధికారులను ఆదేశించారు.
వన్ టౌన్ లో బ్రిడ్జి వద్ద కూలిన గోడను చూసి త్వరగా మరమ్మతులు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, గోడ నిర్మాణం పూర్తయ్యలోపు వెంటనే మెష్ వేసి ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. కె ఎల్ రావు రోడ్, కేఎల్ రావు పార్క్ ప్రాంతాలన్నీ పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదని, పారిశుద్ధ్య కార్మికులు ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా వచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు.
సివిఆర్ ఫ్లైఓవర్ కింద ఉన్న అవుట్ ఫాల్ డ్రైన్ పరిశీలించి, గత కొంతకాలంగా చేస్తున్న డీసిల్టింగ్ ప్రక్రియ కృషి కనపడుతోందని అవుట్ఫాల్ డ్రైన్ కొంతవరకు పరిశుభ్రంగా ఉందని, మరోవైపు జెసిబి తో వ్యర్ధాలను తీస్తున్న పనులు కనబడుతున్నాయని, అధికారులందరూ నిత్యం ఇలాగే ప్రతి అవుట్ ఫర్ డ్రైన్ లలో ఈ కృషి పెడితే కచ్చితంగా డీసిల్టింగ్ ప్రక్రియ విజయవంతమై రోడ్డుపైన నీటి నిల్వలు లేకుండా చూసుకోగలమని అన్నారు. నిజాంపేట్, గాంధీ హిల్ ఔట్ ఫాల్ డ్రైన్ ల స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.