కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి.
` బి.వి.రాఘవలు, సిపిఎం పోలిట్ భ్యూరో సభ్యులు
ప్రచురణార్ధం : 11.11.2024
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై సి.పి.ఎం. దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు జరుపుతోంది.
బిజెపి అధికారంలో ఉన్న ఈ పది సంవత్సరాల కాలంలో దేశం ఎనక్కి పోయిందనీ, అన్ని రంగాల్లో అభివృద్ధి లేదని పైగా మహిళలు, దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగాయినీ, ఒకేదేశం ఒకే ఎన్నిక పేరుతో ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పుకల్గించేందుకు ఎన్.డి.ఏ.ప్రభుత్వం పూనుకున్నదనీ సిపిఎం పార్టీ పోటిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు పేర్కొన్నారు. విజయవాడలో సోమవారం సాయంత్రం సిపిఎం విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ప్రజాచైత్య సభలో అయన ప్రసంగించారు. ఒకేదేశం`ఒకే ఎన్నిక పేరుతో దేశం ప్రజలను బిజెపి ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. పైకి డబ్బు ఆదా అవుతుందని చెప్పినా వాస్తవం కాదన్నారు. ప్రస్తుతం దేశంలో అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ఎన్నికలు జరుగుతున్నాయి, దేశం మొత్తంగా ఒకేసారి నిర్వహింస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది తప్ప మరొకటి కాదు. ఈ నినాదం వెనుక స్ధానిక పార్టీలను దెబ్బతీసే ప్రమాదం ఉందన్నారు. ఇదే బిజెపి కావాల్సిందన్నారు. అక్రమాలు పెరిగిపోతాయి. ఈ రకమైన వాదనలన్నీ ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని మోసం చేయడానికే తప్ప మరొకటి కాదన్నారు. ఈ విధానాన్ని అన్ని రంగాల నిపుణులు వ్యతిరేకిస్తున్నా బిజెపి పట్టించుకోవడం లేదన్నారు. బాషలు, మతాలు, ప్రాంతాలకు ఉండే వైవిద్యాలు బిజెపి దృష్టిలో లేవన్నారు. పెద్దలకు మేలు చేసేందుకే దేశ సంపదను అంబానీ, అదానీలకు కట్టబెట్టే బాగంగానే ఒకే ఎన్నిక, ఒకేదేశం నినాదం తీసుకోచ్చారని విమర్శించారు. ఇంత పెద్ద దేశంలో ఒకే మార్కెట్ చేయాలనే దుర్భిద్ది (ఒకే పన్ను విధానం) ఇందులో దాగి ఉందన్నారు. ఇప్పటికే పోర్టులను అదానికి, అంబానీలకు కట్టబ్టెట్టారు. మిగిలిన సంపదను కూడా కట్టేబెట్టే ప్రయత్నమే ఇది. దీని వల్ల స్ధానిక సంస్థలకు విలువు ఉండదనీ, స్ధానిక సమస్యలు ముందుకు వచ్చే ప్రసక్తి ఉండదని ఆయ వివరించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి తప్ప మరొకటి కాదన్నారు. రాజ్యాంగం రాప్ట్రాలకు ఇచ్చి స్వయం ప్రతిపత్తికి విరుద్దంగా బిజెపి వ్యవహరిస్తున్నది. అసమానతలు సృష్టిస్తోందన్నారు. హిందువులందరినీ ఐక్యం చేసి, వారి ఓట్లతో దేశంలో బలపడేందుకు ఒకే దేశం, ఒకే ఎన్నిక అనే నినాదాన్ని ముందుకు తీసుకొచ్చిందన్నారు. రాజకీయాలకు మతం వాడుకోవడం ప్రజాస్వామ్యానికి, దేశ ప్రజలకు ప్రమాదం కనుక దేశంలో ఉన్న అన్ని వైరుద్యాలను, మతాలను గౌరవించడం వల్లనే మన దేశం ఐక్యం వుంది. దీని ద్వారా దేశం ముందు వెళ్తుందన్నారు.
మరో ప్రక్క దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. మోడీ చెప్పిన మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా ఇప్పుడు చ్పెడం లేదు. ఉత్పత్తి జరగడం లేదు. చదువుకున్న యువ నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. స్థిమైన ఉద్యోగాలు కల్పించిన పరిస్థితి ఈ ప్రభుత్వాని ఇప్పటి వరకు లేదు. ఉద్యోగాల కల్పనలో కూడా అప్రంటీస్ పేరుతో యజమానులకు డబ్బులు కట్టబెట్టే చట్టాలను తీసుకొచ్చారు. మోడి. మ్యాన్ఫ్యాశ్చ సెట్టర్ పెరగకుండా ఉద్యోగలు రావు. ఉపాది సృష్టించే పరిశ్రమలు పెట్టాలి. అందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి తప్ప మరో మార్గం లేదన్నారు. విదేశాలనుండి పరిశ్రమలు రావడం లేదంటే, చదువులో దేశం ఎనుకబడి వుండటం కూడా ఒక కారణం. చంద్రబాబు కూడా అదే బాటలో వ్యవహరిస్తున్నారు. అమరావతి అభివృద్ధి జపం చేస్తున్నారు. అమరావతిలో ఏ పరిశ్రమ పెడతారో? ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు.
గత పదేళ్ళగా మహిళలపై దాడులు చేయడం కొందరి హక్కుగా మారిపోయిందన్నారు. హత్యాచారానికే గురైన వారేపైనే తప్పు మోపే విధంగా వ్యవస్థ తయారైన వైనం పెరిగిందన్నారు. గుజరాత్లో ఇలాగే బిజెపి ప్రభుత్వం తప్పు చేసిన వారికి శిక్షపడకుండా బాధితులదే తప్పని తీర్పు చేసిందన్నారు. దుళితులు, మైనార్టీలపై ఇటువంటి దాడులు ఇంకా పెరిగాయి. ఈశాన్య రాష్ట్రాల్లో చూస్తే పరిస్థితి మరీ దారణంగా వుంది. ఇవన్నీ బిజెపి, దాని పరివార శక్తులు కావాలని సృష్టిస్తున్న విద్శంసం తప్ప మరొకటి కాదన్నారు. స్త్రీ,పురుషుల సమానత్వం లేకుండా దేశం ముందుకు పోదు, అందుకు చట్టాలు తీసురావాలపి. ప్రజలు ఐక్యంగా వుండాలనేది సిపిఎం ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు తెలుగుదేశం అనే పధం మార్చిపోయి, మా ఎన్.డి.ఏ ప్రభుత్వం అని చెబుతున్నారు. మంచిదే, ప్రాంతీయ పార్టీలను నాశనం చేయడంమే బిజెపి పని అని బాబు గమనించాలని ఎద్దేవ చేశారు. వక్ఫ్ బోర్డులను నిర్వీర్యం చేయడానికి బిజెపి పూనుకుంటుంటే ఎందుకు బాబు ఎందుకు మాట్లాడం లేదన్నారు. అమరావతి విషయంలో 13వేల కోట్ల రూపాయల రుణం ప్రపంచబ్యాంకు నుండి అప్పు తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ అప్పు ఎలా తీరుస్తారనే విషయం ప్రజలకు చెప్పాలని, ఈ వివరాలను శాసన సభలో పెట్టి చర్చించాలని కోరారు. ప్రతిపక్ష వై.సి.పి. పార్టీ కూడా తన పాత్రను పోషించకపోవడం దురదృష్టకరం అన్నారు. అసెంబ్లీ బాయ్కాట్ చేయడం సమంజసం కాదని ఆయన సూచించారు. పోలవరం డయాఫ్రం వాల్, రక్షణ గోడలు అన్ని ఒకేసారి నిర్మాస్తామని చెప్పి బాబూగారు ఊరిస్తున్నారని, దీని సాధ్యసాధ్యాలు చూసుకోవాలన్నారు. సరైన పరిశోధన చేయాలని, ప్రజలకు నమ్మకం కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. రక్షణ గోడ నిర్మాణం సాంకేతిక లోపాలను సరిచేదానికి చర్యలు తీసుకోవాలన్నారు. వీటన్నింటిపై సిపిఎం పార్టీ ప్రజల వద్దకు వెళ్ళి ప్రచారానికి తలపెట్టిందన్నారు. ఈ నెల 7నుండి 14వరకు దేశవ్యాప్తంఒగా ప్రచారం, ఆందోళలను చేస్తోందన్నారు. ప్రజలు వీటికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.
రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ రూపాల్లో బాబూ అప్పుడే బాదుడు ప్రారంభించారు. విద్యుత్ భారాలు వేలకోట్ల రూపాయలు పెంచారు. స్మార్ట్ మీటర్ల ప్రమారం ఇంకా అలానే వుందన్నారు. వదర సహాయం వేలాది మందికి ఇవ్వలేదని విమర్శించారు. ప్రతి ఇంటికీ మంచినీరు అందరపోయిన బాబు పాలనలో మద్యం మాత్రం ప్రతి వ్యక్తికీ అందుతోందన్నారు. మద్యం విచ్చలవిడి పెరిగిందన్నారు. ఉచిత ఇసుక హామీలు అమలు కావడం లేదు. ఇటువంటి నేపథ్యంల ప్రజల తరుపున అడిగేందుకవు సి.పి.ఎం. ప్రజాపోరు నిర్వహిస్తున్నదని తెలిపారు.
దోనేపూడి కాశీనాథ్ అధ్యక్షత వహించిన ఈ సభలో సి.పి.ఎం. ఎన్.టి.ఆర్.జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ, రాష్ట్రకమిటీ సభ్యులరాలు కె.దేవి, జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు బి.సత్యబాబు, జిల్లా కమిటీ సభ్యులు బి.రమణారావు, కె.దుర్గారావు, పి.కృష్ణ. టి.ప్రవీణ్కుమార్ తదితరులు ప్రసంగించారు.