Home Political news కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ప్రెస్ కాన్ఫరెన్స్.

కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ప్రెస్ కాన్ఫరెన్స్.

3
0

 విజయవాడ,

8-8-2024,

గురువారం.

కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ప్రెస్ కాన్ఫరెన్స్.

2028-2029 మధ్య రిజర్వేషన్లు రద్దవుతాయి.

సుప్రీం కోర్టు ద్వారా తీర్పు వస్తది. నాకు పక్కా సమాచారం అందింది.

బిజెపి ఆర్ఎస్ఎస్ కుట్ర పన్నుతోంది. 

బిజెపి దళిత వ్యతిరేక పార్టీ. మైనార్టీల వ్యతిరేక పార్టీ. 

బిజెపి ఒత్తిడితో గత వారం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది.

గుజరాత్ నుంచి వచ్చిన తుషార్ మెహత సుప్రీం కోర్టు సొల్యూట్ జనరల్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుకూల వాదనలు చేశారు.

34 మంది సుప్రీంకోర్టు జడ్జిల్లో 20 మంది బ్రాహ్మణ కులానికి చెందిన జడ్జీలు ఉన్నారు.

క్రిమిలేయర్ గురించి మాట్లాడుతున్న సుప్రీం జడ్జిలు ఎప్పుడైనా ఎస్సీ కాలనీలకు వెళ్లి తిరిగారా? 

అంటరానితనం అంటే ఏమిటో జడ్జీలకు తెలుసా? 

సంపన్న వర్గాల నుంచి వచ్చిన న్యాయమూర్తులకు ఆకలి గురించి, పేదరికం గురించి తెలీదు.

జడ్జి బిడ్డలే జడ్జీలు అవుతున్నారు. వారికి క్రిమిలేయర్ వర్తించదా?

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కేవలం ముగ్గురే ఓబీసీ జడ్జీలు ఉన్నారు. 

కోర్టులన్నా, న్యాయమూర్తులంటే నాకు చాలా గౌరవం ఉంది. వాళ్లకి తలవంచి నేను గౌరవిస్తాను.

కానీ భారతదేశ అఖండతను, సమగ్రతను, సమైక్యతను దెబ్బతీసేలా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును భారత దేశ పౌరుడిగా వ్యతిరేకిస్తున్నాను. తీవ్రంగా ఖండిస్తున్నాను.

బాంగ్లాదేశ్ పరిణామాలు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూసిన తర్వాత భారతదేశ అఖండత దెబ్బతింటుందేమోననే ఆందోళన అందరిలో ఉంది.

రిజర్వేషన్లకు ప్రధాని గండి పెట్టాడు.

మోడీ అమిత్ షా ను హెచ్చరిస్తున్నా..

బాంగ్లాదేశ్ పరిస్థితులు భారత్ లో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే.

మనదేశంలో క్లాస్ కంటే క్యాస్ట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈ విషయాన్ని మహాత్మా గాంధీ గుర్తించారు.

సౌత్ ఆఫ్రికా నుంచి బెజవాడకు వచ్చిన గాంధీ చక్రయ్యను కలిశాడు. అన్ని విషయాలు తెలుసుకుని ఆయన్ని కాంగ్రెస్లోకి తీసుకున్నాడు.

దేశ ప్రధమ రాష్ట్రపతిగా చక్రయ్యను  చేయాలని గాంధీ కోరుకున్నాడు. కానీ బ్రెయిన్ ట్యూమర్ తో చక్రయ్య చనిపోయాడు.

గాంధీ గారు హరిజనోద్ధరణ గురించి మాట్లాడారేకానీ… పేదరిక నిర్మూలన గురించి మాట్లాడలేదు… కమ్యూనిస్టు సోదరులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి.

మహాత్మా గాంధీ క్లాస్ ను గురించి మాట్లాడలేదు. క్యాస్ట్ ను గురించి మాట్లాడారు.

మహాత్మా గాంధీ దేశమంతా తిరిగి, రెండే విషయాల గురించి మాట్లాడారు. 

ఒకటి దేశానికి స్వతంత్రం, రెండోది అంటరానితనం గురించి మాత్రమే మాట్లాడారు. 

గాంధీ ఆలోచన, నెహ్రూ స్ఫూర్తి, అంబేద్కర్ తెలివితేటలతో రిజర్వేషన్లు వచ్చాయి.

పోలవరానికి రాజశేఖర్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు? కిరణ్ కుమార్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు? జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు? చంద్రబాబు నాయుడు ఎంత ఖర్చు చేశాడు? 

ఆగస్ట్ 15వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో ప్రజలకు చెప్పాలి.

ఒక వేల చంద్రబాబు పోలవరం లెక్కలు చెప్పకపోతే, నువ్వు కూడా బల్ల కింద వేలు పెట్టినట్లుగా ప్రజలు అనుకోవాల్సి వస్తది.

తెలంగాణలో ఒక కుటుంబం పదేళ్లు అధికారాల్లో ఉండి వేలకోట్ల రూపాయలు సంపాదించారు. ఆ కుటుంబం బిజెపిలో చేరిపోతుందని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్లో పదేళ్లు అధికారాన్ని అనుభవించిన ఒక కుటుంబం వేల కోట్లు సంపాదించారు. 

ఆ కుటుంబానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి తన సెక్యూరిటీ కోసం 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. 

నీ దగ్గర వేల కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, ఆ డబ్బులు పెట్టి, సెక్యూరిటీ పెట్టుకోవచ్చు కదా! 

మాకు లేదే సెక్యూరిటీ! మేము తిరగడం లేదా? నీకెందుకయ్యా అంత సెక్యూరిటీ?

నిన్న అమరావతి వెళ్లి పంట పొలాలను చూశాను.

చంద్రబాబు నాయుడు ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని అంటున్నాడు. దాని గురించి రెండేళ్ల తర్వాత మాట్లాడతా.

జర్నలిస్టులు ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. తలా పది సెంట్లు భూమి వెలగపూడి లో ఇవ్వాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here