Home Political news కేంద్ర మంత్రి “భూపతి రాజు శ్రీనివాస వర్మ” దృష్టికి జర్నలిస్టుల సమస్యలు.

కేంద్ర మంత్రి “భూపతి రాజు శ్రీనివాస వర్మ” దృష్టికి జర్నలిస్టుల సమస్యలు.

4
0

 కేంద్ర మంత్రి “భూపతి రాజు శ్రీనివాస వర్మ” దృష్టికి జర్నలిస్టుల సమస్యలు.

జర్నలిస్టుల హక్కుల సాధనలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ కి వినతి పత్రం అందజేసిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఏ.ఆర్.ఏ) నాయకులు

న్యూఢిల్లీ,

జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతూ జర్నలిస్టుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక జర్నలిస్టు అసోసియేషన్.. అతి తక్కువ కాలంలో భారత దేశంలోనే ఎక్కువ సభ్యులను కలిగిన అసోసియేషన్ గా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ గుర్తింపు పొందింది. జర్నలిస్టుల సంక్షేమానికి ఎన్నో రకాల పోరాటాలు చేసినా కూడా జర్నలిస్టుల బ్రతుకుల్లో ఎలాంటి మార్పు లేకపోవడం తో జర్నలిస్టుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారిపోయింది.. జర్నలిస్టుల సంక్షేమానికి “జర్నలిస్టుల కార్పొరేషన్” ను ఏర్పాటు చేస్తేనే ఫలితం ఉంటుందన్న ఉద్దేశంతో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రతిపక్ష పార్టీల నాయకులను కలిసి జర్నలిస్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు నిరంతరం పోరాటానికి సిద్ధమయింది.. 

ఈ నేపథ్యంలోనే జర్నలిస్ట్ సోదరులకు జరుగుతున్న అన్యాయాన్ని వారి కష్టాలను దృష్టిలో పెట్టుకొని 28 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఏ.ఆర్.ఏ) నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్ర బాబు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ని కలసి జర్నలిస్ట్ కార్పొరేషన్ ఏర్పాటుకు మద్దతు కోసం వినతి పత్రాన్ని అందజేశారు… 

ఈ సందర్భంగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై మీరు చేసే అవిశ్రాంత పోరాటానికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఎన్.ఎ.ఆర్.ఎ నాయకులకు తెలియచేసారు. జర్నలిస్టు సమస్యలను భారత ప్రధానీ నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటానని ఆయన తెలియజేశారు. పత్రికా స్వేచ్చ ప్రతీ సమాజానికి, వ్యక్తి జీవనానికి అత్యంత కీలకమైనది. ఆ దేశంలోకానీ, సమాజంలో కానీ పత్రికా స్వేచ్ఛను నియంత్రించడమంటే ఆ సమాజాన్ని అంధకారంలోకి నెట్టివేయడమన్నారు.

జర్నలిస్ట్ కార్పొరేషన్ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించి, కార్పొరేషన్ సాధించడానికి తను పూర్తి మద్దతు ఇస్తానని తెలియచేసిన కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ కు ఎన్.ఎ.ఆర్.ఎ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు కృతజ్ఞతలు తెలియచేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here