కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజల్లో కి తీసుకొని వెళ్ళాలి…. వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు వై సత్య కుమార్ పిలుపు
భారతీయజనతాపార్టీ NTR జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షతన 11 సంవత్సరాల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన,యోగా దినోత్సవం,బలిదాన్ దివస్, ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం మరియు పర్యావరణ పరిరక్షణ కోసం BJP NTR జిల్లా కార్యశాల
శనివారం బిజెపి రాష్ట్ర కార్యాలయములో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు Y సత్య కుమార్ యాదవ్ మరియు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ ,బిజెపి రాష్ట్ర మీడియా ఇంఛార్జ్ రాతూరి నాగభూషణం పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సత్యకుమార్ మాట్లాడుతూ జూన్ 5 వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటి నుండి ఆగష్టు 5 వరకు విస్తృతంగా మొక్కలు నాటడం,సీడ్ బాల్ తయారీ వంటి కార్యక్రమాలు చేయాలని,జూన్ 23 శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్బంగా ప్రతి పోలింగ్ బూతులో వారిగురించి స్మరించుకుంటూ పుష్పాంజలి ఘటించాలని,జూన్ 25 నాటికి ఇందిరాగాందీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్దితికి (ఎమర్జెన్సీ)కి 50 ఏళ్ళు క్రూరత్వం మరియు ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన యొక్క చీకటి జ్ఞాపకాలు ఇప్పటికి దేశం యొక్క స్మృతిలో సజీవంగానే వున్నాయని,ఆనాడు జరిగిన సంఘటనలను అందరికి తెలిజేయాలని, అభివృద్ధి అంటే గత 11 సంవత్సరాల గానే ఉందన్న విషయం నొక్కి వక్కాణించారు.
ప్రతి ఒక్కరికీ సంక్షేమం అదే సమయంలో అభివృద్ధి ప్రధానమంత్రి ధ్యేయం అన్నారు.
బిజెపి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ మాట్లడుతూ 11 ఏళ్ల మోది ప్రభుత్వం సంకల్పంతో సాకారం అనే అంశం పై రాష్ట్ర స్ధాయిలో ప్రతిజిల్లాలో ప్రొఫేషనల్ సమావేశం మరియు ఎగ్జిబిషన్ జూన్ 11,12 ,తారీకుల్లో నిర్వహించాలని,ఈ సమావేశానికి వైద్యులు ,ఇంజనీర్లు,టీచర్లు,పారిశ్రామిక వేత్తలు,న్యాయవాదులు పాల్గొనేలా చూడాలని,ప్రతి మండలంలో వికసిత్ భారత్ సంకల్పసభ జూన్ 13,14,15 తేదీలలో నిర్వహించాలని,వికసిత్ భారత్ కోసం ప్రతీజ్ఞ చేయించాలని,నగరాల్లోని వీధుల్లో రచ్చబండల వద్ద మరియు గ్రామ పంచాయితీ కేంద్రాల్లో వీధి సమావేశాలు జూన్ 16,17,18 తేదిల్లో నిర్వహించాలని,ఇంటింటి ప్రచారం జూన్ 15 నుండి 20 వరకు చెయ్యాలి అని ఆయన ఈ కార్యశాలలో వివరించారు.ఈ కార్యక్రమంలో ,NTR జిల్లా ప్రధాన కార్యదర్శులు అన్నెపాక ప్రపుల్లా,కొలపల్లి గణేష్ ,మాదాల రమేష్ ,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ముగం,బిజెపి సీనియర్ నాయకులు మువ్వల సుబ్బయ్య,భగవాన్ జీ, పోలే శాంతి,నూతలపాటి బాలకోటేశ్వరరావు,పోతంశెట్టి నాగేశ్వరరావు,చైతన్య శర్మ,పైలా సురేష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు పై బాధ్యతలు ఉన్నవారు, మండల రెండు కార్యక్రమాలకు బాధ్యులుగా నియమించిన వారు ఆహ్వానితులు పాల్గొన్నారు.