Home Political news కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన‌ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన‌ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

3
0

 *05-02-2025*

కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన‌ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) 

ఢిల్లీ :  కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్  తో పాటు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)  స‌హ‌చ‌ర‌ ఎంపీలతో కలిసి  బుధ‌వారం డిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కల‌వ‌టం జ‌రిగింది.  కేంద్ర‌మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను మంత్రి నారా లోకేష్ శాలువాతో స‌త్క‌రించ‌టంతో పాటు శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి విగ్ర‌హా ప్ర‌తిమ‌ను బ‌హుక‌రించారు. 

అనంత‌రం కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంత్రి నారా లోకేష్, ఎంపిల‌తో రాష్ట్ర ప్రగతిని వేగవంతం చేయడానికి సంబంధించిన అనేక విషయాలపై చర్చించారు. ఈ సంద‌ర్భంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)  గత పాలకుల అనాలోచిత విధానాలతో లక్షల కోట్ల అప్పుల్లో మునిగిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం అండగా ఉంటూ రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నందుకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి పార్ల‌మెంట‌రీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవ‌రాయులు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి  రామ్మోహన్ నాయుడు, కేంద్ర భారీ పరిశ్రమ, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎంపి గంటి హరీష్ మాధుర్, ఎంపి బ‌స్తిపాటి నాగరాజు, బిజెపి ఎంపి  సీఎం ర‌మేష్‌,  రాజ్య‌స‌భ ఎంపి సానా స‌తీష్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here