Home Political news కృష్ణ జలాలు అందేది ఎప్పటికీ ?* దోనేపూడి శంకర్ ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి

కృష్ణ జలాలు అందేది ఎప్పటికీ ?* దోనేపూడి శంకర్ ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి

4
0

 

ఏ కొండూరు మండలం

 కృష్ణ జలాలు అందేది ఎప్పటికీ ?* దోనేపూడి శంకర్ ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి

భారత కమ్యూనిస్టు పార్టీ ఏ కొండూరు మండల రెండో మహాసభ దాడి ఆదినారాయణ అధ్యక్షతన సోమవారం ఏ కొండూరు మోహన్ గార్డెన్స్ లో నిర్వహించారు.ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ విచ్చేసారు. మహాసభ ప్రారంభం ముందు సిపిఐ సీనియర్ నాయకులు పసుపులేటి రామారావు అరుణ పతాకన్ని ఆవిష్కరించారు.ఈ సభలో దోనపూడి శంకర్ మాట్లాడుతూ ఏ కొండూరు మండలానికి కృష్ణా జలాలు కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం మే నెల ఆఖరికి అందిస్తానని ఇప్పటివరకు అందించలేకపోయారు.సిపిఐ అనేక పోరాటాలు చేసి ఏ కొండూరు మండలం నుండి విజయవాడ కలెక్టరేట్ వరకు మూడు రోజులు పాదయాత్ర నిర్వహించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి హామీని పొందేలా పోరాటం చేసి ఏ కొండూరు మండలానికి కృష్ణా జలాలు వచ్చేలా చేసింది కేవలం సిపిఐ పార్టీ,సిపిఐ పోరాట ఫలితంగా అని ఆయన అన్నారు.ఏ కొండూరు కృష్ణా జలాల మిగిలిన పైపులైన్ల పనులు ప్రారంభమై వేగవంతంగా పనులు పూర్తి చేసి మంచి నీటిని సరఫరా అందించడం విస్మరించరు అని ఆయన అన్నారు.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మంచినీటి సరఫరాను ప్రజలందరికీ అందించాలని దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు.ఎన్టీఆర్ జిల్లాలోని ఇసుక మాఫియా అనేక మార్గాలలో అక్రమంగా తిరువూరు మండలంలో పరిసర ప్రాంతాల మార్గాల నుండి దొంగ చాటుగా ఇసుక రవాణా చేయడం సహించబోమని అన్నారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి ఇసుక మాఫియా ఇసకని రవాణా చేస్తున్న ఆపలేక చేతులెత్తిన ప్రభుత్వ అధికారులు అని తిరువూరు నియోజకవర్గ పరిసర ప్రాంతాలలో 26 మార్గాల నుండి ఇసుక రవాణా చేస్తూ అధికారుల కండ్లు కప్పుతున్నారని దోనపూడి శంకర్ ఆరోపించారు.రామచంద్రాపురం జాతీయ రహదారి పనులు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టకపోతే సిపిఐ పోరాటానికి సిద్ధమవుతుందని తెలిపారు.ప్రయాణికుల అవస్థ పడుతున్న పరిస్థితుల రీత్యా రహదారి పనులను పూర్తి చేయాలని దోనెపూడి శంకర్ డిమాండ్ చేశారు.ఈ మహాసభకు సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తూము కృష్ణయ్య,సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఎస్ కె నాగుల్ మీరా, కౌలు రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల డేవిడ్, సిపిఐ మండల కార్యదర్శి ముచ్చింతల వెంకటేశ్వర్ రావు, సిపిఐ సీనియర్ నాయకులు పంబి మోహన్, రావు తేళ్లూరి సంగీతరావు, గద్దల వెంకటేశ్వరరావు, ఎస్కే కరిముల్లా, ఏఐవైఎఫ్ ముచ్చింతల మహేష్, బాణావతు సురేంద్ర,చేతి వృత్తిదారుల జిల్లా సమాఖ్య కార్యదర్శి బుద్ధరాపు వెంకట్రావు, సిపిఐ మహిళ సభ్యులు సక్కుర్తి కుమారి,భూక్య చిట్టెమ్మ, కోల లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here