కూటమి ప్రభుత్వం వచ్చేనాటికి అగాధంలో ఉన్న గుడివాడను ప్రగతి పథంలోకి తీసుకెళుతున్నాం:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కూటమి ఏడాది పాలనలో నందివాడ మండలంలో రూ.6.45కోట్ల అభివృద్ధి పనులు పూర్తి బూతులు తిట్టుకుంటే ప్రజలకు మంచి జరుగుతుందా? నందివాడ మండలంలో రూ.2.86 కోట్ల నిధులతో నిర్మాణం పూర్తి చేసుకున్న రహదారులను ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రామ గ్రామాన ఎమ్మెల్యే రాముకు అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు.. ప్రజలందరితో కలిసి రోడ్ల పండుగ నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది: ఎమ్మెల్యే రాము*నందివాడ జూలై 10:కూటమి ప్రభుత్వం వచ్చేనాటికి అన్ని రంగాల్లో అగాధంలో ఉన్న గుడివాడ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. ఒక్క ఏడాదికాలంలోనే నందివాడ మండలంలో రూ.6.45 కోట్లతో అభివృద్ధి పనులను పూర్తి చేయడమే నిదర్శనమన్నారు.నందివాడ మండలంలోని జనార్ధనపురం, నందివాడ, తుమ్మలపల్లి,తమిరిశ, రుద్రపాక, ఇలపర్రు గ్రామాల్లో రూ.2.86 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న 33 బీటీ మరియు సిసి రోడ్లను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మంగళవారం ప్రారంభించారు. రోడ్లను ప్రారంభించేందుకు గ్రామాలకు వచ్చిన ఎమ్మెల్యే రాముకు తీన్మార్ డప్పుల మధ్య టపాసులు కాలుస్తూ.గజమాలలు వేస్తూ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆయా గ్రామస్తులతో కలిసి రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే రాము ప్రతిచోట ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడుతూ బాగున్నారా అంటూ పలకరించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో జరిగిన సభల్లో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ.కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ఒక్క నందివాడ మండలంలోని రూ.6.45 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చెప్పారు. నేడు ప్రజలందరితో కలిసి నందివాడ మండలంలో రోడ్ల పండగను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చేనాటికి ఆగాదం మాదిరి ఉన్న గుడివాడ నియోజకవర్గ పరిస్థితులను ప్రస్తుతం ప్రగతి పథంలోకి తీసుకొచ్చామని….రాబోవు నాలుగేళ్లలో అభివృద్ధి చెందిన గుడివాడను మనందరం చూస్తామని ఎమ్మెల్యే రాము పునరుద్గాటించారు. రాబోవు రోజుల్లో రోడ్లు లేని గ్రామాలు అనేవి ఉండవని ఆయన స్పష్టం చేశారు.బూతులు తిట్టుకుంటే ప్రజలకు మంచి జరుగుతుందా అని ఆయన ప్రశ్నించారు?. రాజకీయ విమర్శలను నేను పట్టించుకోనని, నమ్మి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేలా పనిచేస్తానని ఎమ్మెల్యే రాము అన్నారు. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన పి.4 అనేది ప్రపంచంలోనే ఎంతో గొప్ప కార్యక్రమం అని, పి.4 వల్ల కలిగే ప్రయోజనాలు ,కుటుంబాలకు జరిగే మంచిని రాబోవు రోజుల్లో మనందరం చూస్తామని ఎమ్మెల్యే రాము అన్నారు.శంకుస్థాపన కార్యక్రమాల్లో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవి, మండల టిడిపి అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, డి.సి చైర్మన్ యార్లగడ్డ రవి, సీనియర్ టిడిపి నాయకులు ఆరేకపూడి రామశాస్త్రులు,చేకూరు జగన్ మోహన్ రావు, ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ వేములపల్లి కోదండరామయ్య,ఎండిఓ పి.మల్లేశ్వరి,పంచాయతీ రాజ్ A.E సూరిబాబు,D.E బి.రవి, తాసిల్దార్ N.గురుమూర్తి రెడ్డి. *జనార్ధనపుర టిడిపి నాయకులు* రాఘవరెడ్డి, అంజిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి,పుల్లారెడ్డి బాబి, దాసు, సురేష్, కోటేశ్వరరావు, అజయ్,విజయ్, సరిపల్లి ఉమామహేశ్వర్ రెడ్డి, గొంగళ్ళ వెంకటేశ్వర్లు. *నందివాడ గ్రామ టిడిపి నాయకులు* దారం శ్రీనివాసరావు,నెరుసు నాగరాజు, చిదరిబోయిన సీతయ్య, నంబూరి రాకేష్, రావూరి ఏడుకొండలు, గండి సత్యనారాయణ,మల్లిపోయిన అశోక్, బట్టిపాటి లక్ష్మారెడ్డి, మందపాటి నాగరాజు,వీర్ల లోకేష్, గుండె మహేష్, చాటర్గడ్డ పవన్ కళ్యాణ్…… *తుమ్మలపల్లి గ్రామ నాయకులు* తుమ్మలపల్లి సర్పంచ్ రాధాకృష్ణ, వైస్ సర్పంచ్ సత్యానందం, గూడపాటి పొన్నకేశవరావు, గద్దె సురేష్ కుమార్, ఎరికిపాటి రత్న ప్రసాద్, నున్న బాలాజీ, సాంబయ్య గోవర్ధన్, మద్ద శ్రీనివాసరావు, వరగంచి సామేలు, తోట చిన్న రాజా, పలువురు కూటమి నాయకులు, పెద్ద సంఖ్యలో గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
Home Andhra Pradesh కూటమి ప్రభుత్వం వచ్చేనాటికి అగాధంలో ఉన్న గుడివాడను ప్రగతి పథంలోకి తీసుకెళుతున్నాం:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము