Home Andhra Pradesh కూటమి నేతలతో కలిసి ఎల్.ఓ.సి అందజేస్తున్న కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్

కూటమి నేతలతో కలిసి ఎల్.ఓ.సి అందజేస్తున్న కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్

7
0

బాధిత కుటుంబానికి
ఎల్ .ఓ .సీ అందజేత

బీజేపీ మహిళా మోర్చా నేతలతో కలిసి అందజేసిన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్

ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన
(లెటర్ ఆఫ్ క్రెడిట్)
ఎల్.ఓ.సి ను
గురువారం భవానిపురం
ఎన్డీఏ కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి
ప్రత్తిపాటి శ్రీధర్ , కూటమి నేతలతో కలిసి
అందజేశారు.

43 వ డివిజన్, ఊర్మిళానగర్ రెడ్డి కాలనీకు కు చెందిన ఆర్ నారాయణరెడ్డి (69) ప్రోస్ట్రేట్ గ్రంధి సమస్యతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తనకి మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేశారు.

మంజూరైన రూ 1 లక్ష 80 వేల
ఎల్. ఓ.సీ పత్రాన్ని బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు

త్వరితగతిన ఎల్.ఓ.సీ మంజూరు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

బీజేపీ మహిళా మోర్చా నేతలు బొమ్మదేవర రత్నకుమారి, కూటమి నేతలు ఆకారపు విజయ కుమారి, గన్నవరపు శ్రీనివాసరావు, మంగళపురి మహేష్, గడ్డిపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here