కాపులకు ఇవ్వవలసిన రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి – అఖిలభారత కాపు జేఏసీ
విజయవాడ: ఈరోజు గాంధినగర్ ప్రెస్ క్లబ్ నందు అఖిల భారత కాపు JAC విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కాపు జేఏసీ కన్వీనర్ ఆలా తారకరామారావు మట్లాడుతూ కాపు కులస్థుల ఓట్లను ఏలెక్షన్లలో ఓటు బ్యాంక్ గానే వాడుకుంటూ ఏలెక్షన్ అయిన తరువాత కాపులను వదిలేస్తున్నారని అన్నారు. కాపులకు ఇవ్వవలసిన రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేదల పాలిట పెన్నిధి, బడుగు బలహీనర్గాల ఆశాజ్యోతి అయిన మరణం లేని నాయకుడు వంగవీటి మోహన రంగా గారి విగ్రహాలని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని , వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాపులకు ఇవ్వవలసిన కాపు సబ్సిడీ లోన్ లను వెంటనే అమలు చేయాలని కోరారు. కార్పొరేషన్ కి వెంటనే పాలకమండలి ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారాఅమలు చేసే పథకాలను అమలు చేయాలని కోరారు. కాపులకు నామినేటెడ్ పోస్టులు కష్టపడిన వారికి ఇవ్వాలని కోరారు. లేకపోతేరాబోయే ఎలెక్షన్ లలో కాపులు తీసుకొనే నిర్ణయానికి గురి కాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్లు గొర్రెపాటి అర్జునరావు, వాదా ప్రసాదరావు, సంకటి లక్ష్మణరావు, కత్తి చెన్నకేశవ నాయుడు ,సలాది రామ కృష్ణ, సిరిగిడి లావణ్యకుమార్, చల్లా ప్రభాకర్ రావు, కోరుకొండ పద్మ, జెజ్జెర శ్రీనివాసరావు , ముళ్ళపూడి నాగేశ్వరరావు, లంకా రాంబాబు, పట్టపు సాంబయ్య, ఓంకార్ మురళి, శేఖర్,నరసింహారావు , మరియు కాపు నాయకులు పాల్గొన్నారు