బ్యారేజీల పేర్ల మార్పు సరికాదు కాకాణి
నెల్లూరు జిల్లాలోని, సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బ్యారేజీ అని గత ప్రభుత్వంలో నామకరణం చేసిన విధంగానే కొనసాగించాలి
తెలుగుదేశం ప్రభుత్వం, గత ప్రభుత్వంలో బ్యారేజీలకు పెట్టిన పేర్లను తొలగించడం సరికాదని, బ్యారేజీలకు తిరిగి పాత పేర్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి కాకాణి.
SPS నెల్లూరు జిల్లా:
తేది:20-08-2024
నెల్లూరు నగరంలో డైకస్ రోడ్డులోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి డా౹౹కాకాణి గోవర్ధన్ రెడ్డి
*కాకాణి గోవర్ధన్ రెడ్డి కామెంట్స్:
సోమశిల జలాశయానికి తానే ఆద్యుడిగా చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటు.
1995 నుంచి 2004 వరకూ అయన ముఖ్యమంత్రిగా ఉన్నారు..ఏనాడైనా సమగ్ర సోమశిల గురించి ఆలోచించారా..?
అప్పట్లో 36 టి.ఎం.సి.ల నీటి నిల్వ సామర్థ్యం ఉండేది.. వై.యస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే సోమశిల సామర్థ్యాన్ని 78 టీఎంసీలకు పెంచారు.
అదేవిధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని కూడా 44 వేల క్యూసెక్కులకు అదనంగా పెంచారు.
అప్పట్లో తెలంగాణలోని కాంగ్రెస్ వాదులు దీనిని వ్యతిరేకించినా, వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఖాతరు చేయలేదు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా 14 ఏళ్లల్లో ఎప్పుడూ పెన్నార్ డెల్టా ఆధునీకరణ గురించి పట్టించుకోలేదు.
నెల్లూరు జిల్లాకు చెందిన సంగం…నెల్లూరు బ్యారేజ్ ల నిర్మాణాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పట్టించుకోలేదు.. మేమే పూర్తి చేశాం.
సంగం బ్యారేజ్ కు మంత్రిగా ఉంటూ మరణించిన స్వర్గీయ మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును పెడితే, దానిని చంద్రబాబు తొలగించడం దురదృష్టకరం.
నెల్లూరు జిల్లా సాగునీటి రంగంలో విశేష సేవలు అందించిన మాజీ మంత్రి పేరిట నెల్లూరు బ్యారేజ్ కు పెట్టిన నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి పేరును తొలగించడం అన్యాయం.
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పేర్లు మార్చడం తప్ప, రైతులకు చేసిందేమీ లేదు.
సోమశిల మరమ్మతులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పునాది పడింది.
1995 నాటి చంద్రబాబుని చూస్తారని ఒకసారి, మారిన చంద్రబాబును చూస్తారని ఒకసారి చంద్రబాబు చెప్తున్నాడు.
1995లో చంద్రబాబు ట్రాక్ రికార్డ్ బాగా లేదు..అందుకే ప్రజల్లో ఆందోళన కలుగుతోంది.
యన్.టి.ఆర్. ప్రధాన హామీలైన 2రూ౹౹లకే కిలో బియ్యం, సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే, వాటికి చంద్రబాబు తూట్లు పొడిచాడు.
ఇచ్చిన మాటను తుంగలో తొక్కిన 1995 చంద్రబాబు అంటే ప్రజలు భయపడుతున్నారు.
చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై ప్రజలు అమలు చేస్తాడో, లేదో అని ఆందోళన మొదలైంది.
సోమశిల జలాశయం మరమ్మత్తు పనులను పూర్తి చేయడంతో పాటు, బ్యారేజీలకు గత ప్రభుత్వం నామకరణం చేసిన విధంగా తిరిగి ఆ పేర్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం.