ఎన్ టి ఆర్ జిల్లా రెడ్ క్రాస్ ఆదర్శనంగా నిలవాలి
- కలెక్టర్ లక్ష్మీ షా సూచన
- సమర్థవంతమైన కార్యవర్గం
విజయవాడ,జూన్ 13:
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని ఎన్టీఆర్ జిల్లాలో ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అన్ని రకాల సేవలు అందించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా కోరారు. నూతనంగా ఎంపికైన ఎన్టీఆర్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గంతో జిల్లా కలెక్టర్ శుక్రవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం అయ్యారు .ఎన్టీఆర్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ జి సమరం ,వైస్ చైర్మన్ డాక్టర్ వెలగా జోషీ ఆధ్వర్యంలో కార్యవర్గం జిల్లా కలెక్టర్ తో సమావేశమైంది .ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మిషా మాట్లాడుతూ కొత్త కార్యవర్గ ఎంపిక పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యవర్గంలో సమర్థులకు స్థానం దక్కిందని, ఈ కార్యవర్గం రాబోయే రోజుల్లో విస్తృతమైన సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. డాక్టర్ సమరం, డాక్టర్ వెలగా జోషి ల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మెరుగైన, సమర్థవంతమైన సేవలను అందిస్తుంది అనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు .రెడ్ క్రాస్ లోను, ఇండియన్ మెడికల్ అసోసియేషన్లోనూ డాక్టర్ జి సమరం చేసిన సేవలు, ఉన్న అనుభవాన్ని ఇప్పుడు పూర్తిస్థాయిలో వినియోగించాలని కలెక్టర్ కోరారు. అదేవిధంగా విద్యారంగంలోనూ,ఎం ఎస్ ఎస్ లోనూ డాక్టర్ వెలగా జోషి చేసిన సేవలు ఇప్పుడు రెడ్ క్రాస్ సొసైటీ కి పూర్తిస్థాయిలో వినియోగించాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.