*ప్రచురణార్థం* 29-11-2024
కలెక్టర్ లక్ష్మీశా కు శుభాకాంక్షలు తెలిపిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా కలెక్టరుగా పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జి.లక్ష్మీశ ను విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ కి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోనే ఎన్టీఆర్ జిల్లాను ప్రగతి పథంలో ముందు వుండేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఇందుకు తన వంతు సహకారం అందిస్తానని తెలియజేశారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం ప్రత్యేక చొరవ చూపటంతో పాటు పారదర్శకమైన సేవలు అందించాలని సూచించారు. అనంతరం వీరిరువురు ఎన్టీఆర్ జిల్లాలో పరిష్కారించాల్సిన సమస్యలు, చేయాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై చర్చించుకున్నారు