కలెక్టరేట్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
శనివారం 76వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డా. జి. లక్ష్మీశ జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, డా . బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, కలెక్టరేట్ ఏవో ఎస్.శ్రీనివాసరెడ్డి, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.