కర్ణాటక రాష్ట్ర గవర్నర్ కానిపాకంలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు
చిత్తూరు, ఆగస్టు 4 – కర్ణాటక రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ తన కుటుంబ సభ్యులతో కలిసి, చిత్తూరు జిల్లా కానిపాకంలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో పెంచల కిషోర్ అర్చకులు సంప్రదాయబద్ధంగా గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ని మరియు వారి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా ఆహ్వానించి,ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.