Home Andhra Pradesh ఒత్తిడి ర‌హిత జీవితానికి యోగా జీవ‌న‌శైలి వ్యాధుల నుంచి యోగా ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది స‌మాజంలోని ప్ర‌తి...

ఒత్తిడి ర‌హిత జీవితానికి యోగా జీవ‌న‌శైలి వ్యాధుల నుంచి యోగా ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది స‌మాజంలోని ప్ర‌తి వ‌ర్గానికీ యోగాను చేరువ‌చేసేందుకు కృషి

2
0

ఎన్‌టీఆర్ జిల్లా, జూన్ 06, 2025 ఒత్తిడి ర‌హిత జీవితానికి యోగా జీవ‌న‌శైలి వ్యాధుల నుంచి యోగా ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది స‌మాజంలోని ప్ర‌తి వ‌ర్గానికీ యోగాను చేరువ‌చేసేందుకు కృషి బీఆర్‌టీఎస్ యోగా స్ట్రీట్‌లో విజ‌య‌వంతంగా న్యాయ‌వాదుల థీమ్ యోగా జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌*ఒత్తిడి ర‌హిత జీవితానికి యోగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని.. డ‌యాబెటీస్‌, హైప‌ర్ టెన్ష‌న్‌, స్థూల‌కాయం వంటి జీవ‌న‌శైలి రుగ్మ‌త‌ల నుంచి యోగా ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.యోగాంధ్ర-2025 మాసోత్స‌వాల సంద‌ర్భంగా శుక్ర‌వారం విజ‌య‌వాడ‌లోని బీఆర్‌టీఎస్ యోగాస్ట్రీట్ నందు జిల్లా అధికార యంత్రాంగం, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడ బార్ అసోసియేష‌న్ భాగ‌స్వామ్యంతో లాయ‌ర్ల థీమ్ యోగా కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. విజ‌య‌వాడ బార్ అసోసియేష‌న్ స‌భ్యుల‌తో క‌లిసి యోగాస‌నాలు వేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ గౌర‌వ ప్ర‌ధాని, గౌర‌వ ముఖ్య‌మంత్రి మార్గ‌నిర్దేశంతో భార‌త‌దేశ వార‌స‌త్వ సంప‌ద అయిన యోగాను స‌మాజంలోని ప్ర‌తి వ‌ర్గానికి చేరువ‌చేసేందుకు కృషిచేస్తున్నామ‌ని, ఇందులో భాగంగా రోజుకో వ‌ర్గ ప్ర‌జ‌ల‌తో థీమ్ యోగా నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. శుక్ర‌వారం లాయ‌ర్ల‌తో థీమ్ యోగా నిర్వ‌హించిన‌ట్లు వెల్ల‌డించారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నిపుణుల స‌హాయంతో రూపొందించిన 45 నిమిషాల కామ‌న్ యోగా ప్రోటోకాల్‌లో చాలా స‌ర‌ళ‌మైన ఆస‌నాలు ఉన్నాయ‌ని.. వీటిని చిన్నాపెద్దా, స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా ఎవ‌రైనా చాలా తేలిగ్గా ప్రాక్టీస్ చేయొచ్చ‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం యోగాంధ్ర ద్వారా జూన్ 21 నాటికి క‌నీసం రెండు కోట్ల మందికి యోగాను నేర్పాల‌ని ల‌క్ష్యంగా నిర్దేశించుకున్న‌ట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లాలో క‌నీసం ప‌ది ల‌క్ష‌ల మందికి యోగాను చేరువ‌చేసేందుకు కృషిచేస్తున్నామ‌న్నారు. చేసే ప‌నిని ధ్యాస‌తో చేస్తూ మంచి ఫ‌లితాలు వ‌చ్చేందుకు యోగాస‌నాల ఆచ‌ర‌ణ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పేర్కొన్నారు.కార్య‌క్ర‌మంలో విజ‌య‌వాడ ఆర్‌డీవో కావూరి చైత‌న్య‌, బెజ‌వాడ బార్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ ఏకే బాషా, సెక్ర‌ట‌రీ కేవీ రంగారావు, మాజీ కార్య‌ద‌ర్శులు జున్ను శ్రీధర్, పుప్పాల శ్రీనివాసరావు, స‌భ్యులు పి.జ‌య‌ల‌క్ష్మి, టి.హరికృష్ణ, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, ఆయుష్ అధికారులు డా. వి.రాణి, డా. రామ‌త్లేహి, డా. ర‌త్న‌ప్రియ‌ద‌ర్శిని, యోగా ట్రైన‌ర్లు స‌త్య‌నారాయ‌ణ‌, రామాంజనేయులు తదిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here