అమరావతి-
6-02-2025
ఏపీ సచివాలయంలో ధరల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ సమావేశం
రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ధరల పర్యవేక్షణ పై మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ముఖ్యంగా, మార్కెట్ ధరలపై నిత్యం పర్యవేక్షణ, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు, మిల్లెట్ల ప్రోత్సాహం
ప్రస్తుత మార్కెట్ లో ధరల పరిస్ధితిని సమీక్షించిన మంత్రులు, అధికారులు
డిసెంబర్ 2024లో ఆంధ్రప్రదేశ్ ద్రవ్యోల్బణం రేటు 4.34% కాగా, జాతీయ సగటు 5.22% కంటే తక్కువగా ఉంది.
154 మండల కేంద్రాల్లోని సీపీ యాప్ ద్వారా ప్రతీరోజూ ధరల సేకరణ, విశ్లేషణ చేస్తున్న ప్రభుత్వం
అదేవిధంగా 151 రైతు బజార్ ధరలను విశ్లేషించడం జరుగుతుంది
ఆంధ్రప్రదేశ్లో 69 నిత్యవసర సరుకులు ధరలను పర్యవేక్షిస్తారు, వీటిలో ధాన్యాలు, కూరగాయలు, వంటనూనెలు, మసాలాలు ఉన్నాయి.
గత ఏడాదితో పోల్చితే
కందిపప్పు (13%), గ్రౌండ్నట్ ఆయిల్ (4%), మిర్చి (27%) ధరలు తగ్గాయి.
AP మిషన్ మిల్లెట్ వంటి పథకాల ద్వారా జొన్నలు, రాగిలను ప్రోత్సహించేందుకు నిర్ణయించారు
మిడ్-డే మీల్స్, సంక్షేమ పథకాలలో మిల్లెట్లు చేర్చడం
అదే విధంగా మిల్లెట్ వాడకాన్ని ప్రోత్సహించడం
రైతులకు ధరల సమాచారం ఎప్పటికప్పుడు అందించేందుకు చర్యలు
రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అధికంగా ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో ధరలు పెరగడానికి కారణం కావడంతో… ధరల అదుపుకు తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశం…