విజయవాడ
10-12-2024
ఏపీలో రైతుల సమస్యలపై డిసెంబరు 13న రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్సీపీ ఉద్యమం
అన్నదాతకు అండగా వైయస్ ఆర్ సిపి పోస్టర్ను విడుదల చేసిన మాజీ మంత్రి వెలంపల్లి, ఎమ్మెల్సీ Md రుహుల్లా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
డిసెంబర్ 13 న ఎన్టీఆర్ జిల్లా వైయస్ అర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరగనున్న ధర్నా కార్యక్రమం, విజ్ఞాపన పత్రం అందజేసే కార్యక్రమంలో పెద్ద ఎత్తున్న రైతులు, వైసిపి శ్రేణులు పాల్గొని విజయవంతం చేయండి – వెలంపల్లి
ఏపీలో రైతుల సమస్యలపై డిసెంబరు 13న రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్సీపీ చేయనున్న ఉద్యమ పోస్టర్ ను మంగళవారం నాడు బ్రాహ్మణ వీధిలోని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు, శాసనమండలి సభ్యులు Md రుహుల్లా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొని అన్నదాతకు అండగా వైయస్ ఆర్ సిపి దగా చేస్తున్న కూటమి సర్కార్ పై నిరసన గళం అని ముద్రించిన పోస్టర్లను విడుదల చేసారు. ఈ సందర్బంగా మాజి మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ డిసెంబర్ 13 న ఎన్టీఆర్ జిల్లా వైయస్ అర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరగనున్న ధర్నా కార్యక్రమం, కలెక్టర్ కి విజ్ఞాపన పత్రం అందజేసే కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, విజయవాడ పశ్చిమ వైసిపి శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు