ఏపీలోనూ రైతుల రుణమాఫి అమలు చేయాలి
రైతుల ఆర్థిక పరిస్థితులపై ఆలోచన చేయాలి
భారీ వర్షాలను ఒక విపత్తుగా ప్రకటించాలి
మీడియా సమావేశంలో వైయస్ షర్మిళ
*విజయవాడ, సెల్ఐటి న్యూస్:- ఇప్పటికే రాష్ట్రంలో రైతులు చితికి పోయి ఉన్నారని, వారి ల మీద భారీ వర్షాలు పిడుగు పడ్డట్లు అయ్యిందని, తక్షణమే పంట నష్టపోయిన రైతులను కూటమి సర్కారు ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిళ డిమాండ్ చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో సోమవారం వైయస్ షర్మిళ మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ సర్కార్లో రైతులు చితికి పోయారు. వైయస్సార్ ఉన్నప్పుడు వ్యవసాయం పండుగ. రైతుకు వైఎస్ఆర్ పెద్ద పీట వేశారు. వైఎస్ఆర్ తలపెట్టిన జలయజ్ఞం జగన్ విస్మరించారు. సబ్సిడీ పథకాలను మొత్తం జగన్ ఎత్తేశాడు. అప్పు లేని రైతు అంటూ రాష్ట్రంలో లేడు. ధరల స్థిరీకరణ నిధి అని మోసం. ఇలాంటి రైతుల మీద ఇప్పుడు పడ్డ వానలు మళ్ళీ భారాన్ని మోపాయి. వర్షాలు భారీ ఎత్తున నష్టాన్ని మూట గట్టాయి. వేసిన పంటలు వేసినట్లే కొట్టుకు పోయాయి. మళ్ళీ పంటలు వేయలేని పరిస్థితి. ఇలాంటి రైతులను ఇప్పుడు కూటమి సర్కార్ ఆదుకోవాలి. రైతుల ఆర్థిక పరిస్థితులపై ఆలోచన చేయాలి. కూటమి సర్కార్ అధికారంలో ఉన్నా బిజెపి మన రాష్ట్రంపై చిన్న చూపు చూస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పూర్తి స్థాయిలో పంపలేదు. ఏపిపై బిజెపిది సవతి తల్లి ప్రేమ. ఒక్క మేలు చేయలేదు సరికదా అని మోసాలే. అలాంటి బిజెపితో చంద్రబాబు కూటమి గట్టారు. ఇప్పటికైనా రైతులను ఆదుకోండి. రాష్ట్ర విపత్తుగా పరిగణలో తీసుకొని ప్రతి రైతుకు నష్టపరిహారం ఇవ్వాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేసినట్లే ఏపిలో కూడా అధికారంలో వచ్చి ఉంటే రుణమాఫీ చేసే వాళ్ళం. మ్యానిఫెస్టోలో లేకపోయినా ఇక్కడ ఎందుకు అమలు చేయరు అని చంద్రబాబును అడుగుతున్నాం. ఏపి నుంచి 25 మంది ఎంపీలు ఉన్నారు. అందరు బిజెపికి మద్దతు ఇస్తున్నారు.. కానీ ప్రయోజనం శూన్యం. మన ఎంపీలను బిజెపి వాడుకుంటుంది. జగన్ హత్యా రాజకీయాలు, గొడ్డలి రాజకీయాలు చేశారు. హత్య చేసిన వాళ్ళతో బుజాలు రాసుకొని తిరిగారు. సొంత చెల్లెళ్ళకు వెన్నుపోటు పొడిచారు. హోదా మీద బిజెపి మోసం చేస్తే ఒక్క రోజు ధర్నా చేయలేదు? ప్రత్యేక హోదా కావాలని ధర్నా చేయలేదు?. సిగ్గు లేకుండా కార్యకర్త హత్య మీద ఇప్పుడు డిల్లి ధర్నా అంటున్నారు. వినుకొండ మర్డర్ రాజకీయం కాదు. వ్యక్తిగత హత్య అని మా విచారణలో వ్యక్తిగత హత్యా అని తెలిసింది. నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నా రాష్ట్రంలో పోలీసులు పట్టించుకోపోవడం బాధాకరం. శాంతి భద్రతలను కాపాడాల్సిన అవసరం వారికి లేదా అని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.