Home Political news ఏటా 2684 కోట్ల రూపాయలతో ఉచిత గ్యాస్ సిలెండర్ల పధకం

ఏటా 2684 కోట్ల రూపాయలతో ఉచిత గ్యాస్ సిలెండర్ల పధకం

3
0

ఏటా 2684 కోట్ల రూపాయలతో ఉచిత గ్యాస్ సిలెండర్ల పధకం

నిరుపేదలకు పెన్షన్ లకు నెలకు 2710 కోట్ల రూపాయలు దీపం పథకం లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు అందజేసిన మంత్రి

చనుబండ గ్రామంలో దీపం వెలుగులు

చింతలపూడి ఎత్తిపోతల పధకాన్ని త్వరలోనే పూర్తి చేస్తాం-రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి

        ఏలూరు/చాట్రాయి, నవంబర్, 3 : ఏటా 2684 కోట్ల రూపాయలతో ఉచిత గ్యాస్ సిలెండర్ల పధకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా చాట్రాయి మండలంలోని చనుబండ గ్రామంలో మంత్రి కొలుసు పార్ధసారధి దీపం 2.O పథకానికి శ్రీకారం చుట్టారు.ఆదివారం లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా 

 ప్రభుత్వo ఏర్పడిన కొద్దీ రోజుల్లోనే అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు మంత్రి వివరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 1. 08 కోట్ల మంది మహిళలకు దీపం పధకం కింద 3 వంట గ్యాస్ సిలెండర్లు ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఇందుకోసం ఏటా 2684 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని మంత్రి వివరించారు. అంతేకాక రాష్ట్రంలోని 64. 14 లక్షల మంది పేదలకు ప్రతీ నెలా ఒకటవతేదీనే పెన్షన్లు అందిస్తున్నామన్నారు. ఇందుకోసం నెలకు 2710 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న 4 వేల రూపాయల పెన్షన్ ద్వారా నిరుపేదలైన వృద్ధులు పేదలలో ఎంతో ఆత్మవిశ్వాసం నింపామన్నారు. కూటమి ప్రభుత్వంతో రాష్ట్ర ప్రజానీకం ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు ఎలాంటి కష్టం కలిగినా తాను ఒక కుటుంబ సభ్యుడిగా ఆదుకుంటారని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని మంత్రి తెలిపారు. ప్రజలకు సంక్షేమ పధకాలతోపాటు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు జిల్లాలో రూ120 కోట్ల విలువైన పనులకు శంఖుస్ధాపన చేశామన్నారు. ఈ పనులన్నీ వచ్చే జనవరి నాటికి పూర్తిచేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెలా ఒకటోవ తేదీన పెన్షన్ల కింద 4 వేల రూపాయలు అందించడం జరుతుందన్నారు. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రూ. 1600 వందల కోట్ల రూపాయల బకాయిలను కూటమి ప్రభుత్వం రైతులకు చెల్లించిందని తెలిపారు. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఐదు మేజరు ప్రాజెక్టులలో చింతలపూడి ఎత్తిపోతుల పధకం ఒకటని, రాబోయే రోజుల్లో ప్రాజెక్టును పూర్తిచేసి గోదావరి జలాలను సాగుకు వినియోగించేలా చేస్తామని మంత్రి తెలిపారు. గ్రామ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు పూర్తినమ్మకంతో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని మీరుఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ఐదేళ్లలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చడం జరుగుతుందని మంత్రి తెలిపారు.  

 కార్యక్రమంలో తహశీల్దారు , స్ధానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here